NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 
    రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

    Delhi : రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 16, 2025
    10:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో శనివారం న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.

    ఈ విషాద ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడినట్లు అధికారిక సమాచారం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించింది.

    తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పగాయాలపాలైనవారికి రూ.1 లక్ష సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

    మృతుల్లో బిహార్‌కు చెందిన 9 మంది, దిల్లీకి చెందిన 8 మంది, హరియాణాకు చెందిన ఒకరు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.

    Detail

    రాష్ట్రపతి, ప్రధాని స్పందన 

    రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    'న్యూదిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట హృదయవిదారకమన్నారు.

    మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

    Details

     తొక్కిసలాటకు కారణాలు 

    కుంభమేళా కోసం వేలాదిగా భక్తులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు.

    14వ నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ నిలిచివుండగా, భక్తులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

    అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైన కారణంగా ప్రయాణికులు 12, 13, 14వ ప్లాట్‌ఫాంలలో భారీగా కిక్కిరిసిపోయారు.

    ఈ రద్దీ ఒక్కసారిగా తీవ్రంగా మారి తొక్కిసలాటకు దారితీసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ద్రౌపది ముర్ము
    దిల్లీ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    ద్రౌపది ముర్ము

    బొల్లారం రాష్ట్రపతి నిలయంలోకి విద్యార్థులకు ఉచిత ప్రవేశం; నేటి నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు తెలంగాణ
    బిహార్ డాన్ ఆనంద్ మోహన్ సింగ్ విడుదలపై ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అసోసియేషన్ అభ్యంతరం  ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    దిల్లీ

    Delhi Elections: దిల్లీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ గ్యారంటీలను విడుదల చేసిన రేవంత్‌ భారతదేశం
    Ayushman Bharat: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం.. సుప్రీంలో ఆప్‌ సర్కార్‌కు ఊరట భారతదేశం
    AAP: అద్దె ఇళ్లలో నివసించే పౌరులకు ఉచిత విద్యుత్‌, నీరు.. కేజ్రీవాల్ కీలక హామీ అరవింద్ కేజ్రీవాల్
    #NewsBytesExplainer: ఉచితాలు vs అభివృద్ధి.. దిల్లీలో పరిస్థితి ఎలా ఉంది? కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025