NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు 
    తదుపరి వార్తా కథనం
    Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు 
    ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు

    Effect of heavy rains: ఆంధ్రా, తెలంగాణలో వర్షాల బీభత్సం.. 19 మంది మృతి, 140 రైళ్లు రద్దు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 02, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం చోటుచేసుకుంది. ఆస్తి నష్టం, ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.

    ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి, వారికి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో 9 మంది, తెలంగాణలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

    వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌లో వరద నీటిలో కొట్టుకుపోగా, తెలంగాణలో ఒకరు గల్లంతయ్యారని సమాచారం.

    Details

    97 రైళ్లను దారి మళ్లించిన దక్షిణ మధ్య రైల్వే

    దక్షిణ మధ్య రైల్వే (SCR) 140 రైళ్లను రద్దు చేయగా, 97 రైళ్లను దారి మళ్లించింది. దాదాపు 6,000 మంది ప్రయాణికులు వివిధ స్టేషన్లలో చిక్కుకుపోయారు.

    నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, రాష్ట్ర విపత్తు సహాయ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

    ఇప్పటికే 17,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    హైదరాబాద్‌లో రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

    Details

    పాఠశాలలకు సెలవు

    సెప్టెంబర్ 2న హైదరాబాద్‌ జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో మాట్లాడి, వరదల సమస్యలను ఎదుర్కొనేందుకు పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

    భారీ వర్షాల కారణంగా ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లోని వంతెనలు, రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

    సెప్టెంబరు 2 నుంచి 5 వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఆంధ్రప్రదేశ్

    Rowdy Sheeter Murder: పాతబస్తీలో రౌడీషీటర్‌ను కాల్చి చంపిన దుండగలు హైదరాబాద్
    Anitha: ఏపీ హోం మంత్రి అనితకు తప్పిన ప్రమాదం హోంశాఖ మంత్రి
    Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి టైం ఫిక్స్ ..ప్రకటించిన  మంత్రి నారాయణ   భారతదేశం
    Amaravati:  అమరావతికి  ప్రపంచ బ్యాంకు బృందం.. కీలక అంశాలపై చర్చ  భారతదేశం

    తెలంగాణ

    Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై నిరీక్షణ.. దానిపై స్పష్టత వచ్చాకనే  రేవంత్ రెడ్డి
    Smita Sabharwal: స్మితా సబర్వాల్ బంఫర్ ఆఫర్.. చిన్న ఐడియా ఇస్తే లక్ష బహుమతి ఇండియా
    Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ ప్రభుత్వం
    Raksha Bandhan Tragedy: చనిపోయే ముందు సోదరుడికి రాఖీ కట్టిన యువతి రాఖీ పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025