NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
    తదుపరి వార్తా కథనం
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?
    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?

    Raisina Dialogue 2024: 'రైసినా డైలాగ్' అంటే ఏమిటి? దీని ప్రాముఖ్యత ఏంటి?

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2024
    04:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలో 9వ 'రైసినా డైలాగ్' (Raisina Dialogue 2024) 21 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 23 శుక్రవారం వరకు జరగనుంది.

    బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభిస్తారు.

    ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు బుధవారం ఉదయమే భారత్‌కు చేరుకున్నారు.

    రైసినా డైలాగ్ అనేది భారతదేశం నిర్వహించే సదస్సు. భారత ప్రభుత్వం ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తుంది.

    విదేశాంగ విధానం, ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు.

    ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత సవాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే ఈ సదస్సు లక్ష్యం.

    మోదీ

    'రైసినా' అంటే అర్థం ఇదే..

    ఈ సదస్సులో రాజకీయ (ఒక దేశంలోని అగ్రనేతలు, క్యాబినెట్ మంత్రులు మొదలైనవారు), వ్యాపారవేత్తలు, పరిశోధకులు, మేధావులు, మీడియా, పౌర సమాజంతో సహా అనేక నేపథ్యాల ప్రజలు ఇందులో పాల్గొంటారు.

    ఈ సదస్సును దిల్లీ స్వతంత్ర థింక్ ట్యాంక్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ORF), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తాయి.

    'రైసినా డైలాగ్' పేరులోని 'రైసినా' అనే పదం దిల్లీ నడిబొడ్డున ఉన్న రైసినా కొండను సూచిస్తుంది. ఈ కొండపైనే రాష్ట్రపతి భవన్‌ను నిర్మించారు.

    మోదీ

    సమావేశానికి ఎవరు హాజరవుతారు?

    115 దేశాల నుంచి 2,500 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారు.

    ఇందులో పలువురు మంత్రులు, మాజీ ప్రధానులు మరియు అధ్యక్షులు, సైనిక కమాండర్లు, సాంకేతిక నాయకులు, విద్యావేత్తలు, పాత్రికేయులు, వ్యూహాత్మక వ్యవహారాల పండితులు, ప్రముఖ థింక్ ట్యాంక్‌ల నిపుణులు ఉంటారు.

    రైసినా డైలాగ్ కాన్ఫరెన్స్ భారతదేశంలో 2016 సంవత్సరంలో ప్రారంభమైంది.

    దీన్ని షాంగ్రి-లా డైలాగ్ తరహాలో భారత్ నిర్వహిస్తుంది. సింగపూర్‌లో జరిగే భద్రత, రక్షణ గురించి చర్చించడానికి షాంగ్రీ-లా డైలాగ్‌ను నిర్వహిస్తారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సదస్సుకు హాజరైన  ప్రధాని గ్రీస్ ప్రధాని 

    #WATCH | PM Narendra Modi and Greek Prime Minister Kyriakos Mitsotakis arrive at Hyderabad House in Delhi to hold bilateral talks pic.twitter.com/3st7it5UYj

    — ANI (@ANI) February 21, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    గ్రీస్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Ram Mandir: 32 ఏళ్ల క్రితం.. జనవరి 14న అయోధ్యలో మోదీ చేసిన ఈ ప్రతిజ్ఞ గురించి తెలుసా? అయోధ్య
    Shankaracharyas: రామాలయ ప్రతిష్టాపనకు నలుగురు శంకరాచార్యులు ఎందుకు రావట్లేదు? స్వామి నిశ్చలానంద ఏమన్నారు? అయోధ్య
    PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం  ఆంధ్రప్రదేశ్
    Narendra Modi: ఆంధ్రాలో చారిత్రక రామాయణ క్షేత్రాన్ని సందర్శించిన ప్రధాని మోదీ  భారతదేశం

    దిల్లీ

    Delhi: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 100 విమానాలు, 18 రైళ్లు ఆలస్యం  తాజా వార్తలు
    IndiGo Airlines: ఢిల్లీ-గోవా ఇండిగో పైలట్‌కు కొట్టిన ప్రయాణికుడి క్షమాపణ వీడియో వైరల్‌  భారతదేశం
    Delhi: ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు .. 50 విమానాలు, 30 రైళ్లుపై స‌ర్వీసుల‌కు తీవ్ర అంత‌రాయం భారతదేశం
    Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు హత్య

    గ్రీస్

    రెండు రైళ్లు ఢీకొని 26 మంది మృతి; 85 మందికి గాయాలు రైల్వే శాఖ మంత్రి
    గ్రీస్ తీరంలో మునిగిపోయిన పడవ: 79 మంది వలసదారులు మృతి వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    40 ఏళ్ల తర్వాత గ్రీస్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు ప్రధాన మంత్రి
    Athens: గ్రీక్ షిప్పింగ్ కంపెనీలో కాల్పులు.. ఒకరు మృతి  తుపాకీ కాల్పులు

    తాజా వార్తలు

    Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ గైర్హాజరు  అరవింద్ కేజ్రీవాల్
    TSBIE- 2024: తెలంగాణ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి  ఇంటర్
    OTT releases this week: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే  ఓటిటి
    Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025