NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

    వ్రాసిన వారు Naveen Stalin
    Jun 01, 2023
    03:56 pm
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంది. త్రిపుర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ సింగ్‌ని మణిపూర్‌ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత డీజీపీ పీ. డౌంగెల్‌ను హోం శాఖకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణ వల్ల దాదాపు 80మంది మృతి చెందారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.

    2/2

    రాజీవ్ సింగ్ నియామకం ప్రభుత్వ వ్యూహమేనా?

    రాజీవ్ సింగ్ గతంలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. మే 29న కేంద్రం నుంచి మణిపూర్‌కు ఇంటర్-కేడర్ డిప్యుటేషన్‌పై పంపబడ్డారు. మణిపూర్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా సీఆర్‌పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిన కొద్దిరోజులకు కేంద్రం రాజీవ్ సింగ్‌ను నియమించింది. రాష్ట్రంలో గిరిజనేతర, మైతీయేతర పోలీసులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీస్ కొత్త బాస్‌ను వ్యూహాత్మకంగానే రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే నేతృత్వంలోని శాంతి కమిటీలో అన్ని రాజకీయ పార్టీలు, కుకీ, మైతీ తెగలకు చెందిన వారు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    మణిపూర్
    అమిత్ షా
    త్రిపుర

    మణిపూర్

    మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు 5 కీలక నిర్ణయాలు  అమిత్ షా
    మణిపూర్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం, ఉద్యోగాలు  అమిత్ షా
    మణిపూర్‌లో అమిత్ షా;  ఉద్రిక్తతలను తగ్గించడంపై స్పెషల్ ఫోకస్ అమిత్ షా
    అసోంలోని సోనిత్‌పూర్‌లో 4.4 తీవ్రతతో భూకంపం అస్సాం/అసోం

    అమిత్ షా

    'తమిళనాడులో పాలు సేకరించకుండా అమూల్‌ను నియంత్రిచండి': అమిత్ షాకు స్టాలిన్ లేఖ తమిళనాడు
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం హోంశాఖ మంత్రి
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ

    త్రిపుర

    ముఖ్యమంత్రి రేసులో ప్రతిమా భౌమిక్; అదే జరిగితే మొదటి మహిళా సీఎంగా రికార్డు ముఖ్యమంత్రి
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023