NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
    తదుపరి వార్తా కథనం
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 
    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

    మణిపూర్ హింసాకాండ ఎఫెక్ట్; డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు 

    వ్రాసిన వారు Stalin
    Jun 01, 2023
    03:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీని మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంది.

    త్రిపుర కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి రాజీవ్ సింగ్‌ని మణిపూర్‌ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ప్రభుత్వం నియమించింది.

    ప్రస్తుత డీజీపీ పీ. డౌంగెల్‌ను హోం శాఖకు బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    మణిపూర్‌లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణ వల్ల దాదాపు 80మంది మృతి చెందారు.

    దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు శాఖ నాయకత్వంలో మార్పులకు శ్రీకారం చుట్టింది.

    డీజీపీ

    రాజీవ్ సింగ్ నియామకం ప్రభుత్వ వ్యూహమేనా?

    రాజీవ్ సింగ్ గతంలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పనిచేశారు. మే 29న కేంద్రం నుంచి మణిపూర్‌కు ఇంటర్-కేడర్ డిప్యుటేషన్‌పై పంపబడ్డారు.

    మణిపూర్ ప్రభుత్వానికి భద్రతా సలహాదారుగా సీఆర్‌పీఎఫ్ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించిన కొద్దిరోజులకు కేంద్రం రాజీవ్ సింగ్‌ను నియమించింది.

    రాష్ట్రంలో గిరిజనేతర, మైతీయేతర పోలీసులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీస్ కొత్త బాస్‌ను వ్యూహాత్మకంగానే రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.

    రాష్ట్రంలో సంక్షోభాన్ని పరిష్కరించడానికి శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉయికే నేతృత్వంలోని శాంతి కమిటీలో అన్ని రాజకీయ పార్టీలు, కుకీ, మైతీ తెగలకు చెందిన వారు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మణిపూర్
    అమిత్ షా
    త్రిపుర

    తాజా

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్

    మణిపూర్

    మణిపూర్‌లో ఉద్రిక్తత: సీఎం కార్యక్రమ వేదికకు నిప్పు; 144 సెక్షన్ విధింపు  నోంగ్‌తోంబమ్ బీరెన్ సింగ్
    మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత; రాష్ట్రం ఎందుకు రావణకాష్టమైంది? ఈ హింస వెనకాల ఉన్న దశాబ్దాల కథేంటి? ఇంఫాల్
    మణిపూర్‌లో 'నీట్ యూజీ 2023' పరీక్ష వాయిదా  తాజా వార్తలు
    మణిపూర్‌లో 23,000మందిని రక్షించిన సైన్యం; చురచంద్‌పూర్‌లో పాక్షికంగా కర్ఫ్యూ సడలింపు  ఆర్మీ

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ

    త్రిపుర

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల నాగాలాండ్
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    'రాష్ట్రాన్ని దోచుకొని, ప్రజలను పేదరికంలోకి నెట్టారు'; త్రిపురలో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమిపై మోదీ ధ్వజం అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025