
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఎంపిక ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం బీజేపీ హైకమాండ్ నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈసారి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికను పోటీ లేకుండా, సమ్మతితోనే పూర్తిచేసేలా కేంద్ర నాయకత్వం ముందస్తు వ్యూహాన్ని రచించింది. అందుకే అన్ని వర్గాల సమన్వయంతో అభ్యంతరాలు లేకుండా రామచందర్ రావు పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రబాబు నాయుడు సన్నిహితుడు ఎంపిక
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2025
తెలంగాణ బీజేపీలో చక్రం తిప్పిన చంద్రబాబు
చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడైన ఎన్. రామచందర్ రావును తెలంగాణ బీజేపీ అధ్యకుడిగా ఖరారు చేసిన అధిష్టానం
ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి రాకుండా చెక్ పెట్టిన బీజేపీ సీనియర్ నాయకులు
రామచందర్ రావును నామినేషన్ వేయాలని… pic.twitter.com/Abnnf0uHDB
Details
నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో భాగంగా సోమవారం నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకూ నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. జూలై 1న అధికారికంగా ఎన్నిక ఫలితాన్ని ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రానికి చెందిన 119 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 38 మంది జిల్లా శాఖల అధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొననున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ ఇప్పటికే సన్నాహక చర్యలు చేపట్టింది.
Details
మన్నెగూడలో సన్నాహక సమావేశం
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి, రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ అభయ్ పాటిల్, సంస్థాగత ఇన్చార్జ్ చంద్రశేఖర్ తివారి, ఇతర రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొని నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు.