
PM Modi: జపాన్ పీఎం,ఆయన సతీమణికి మోదీ ప్రత్యేక కానుకలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో, ఆయన సతీమణికి ప్రత్యేక బహుమతులు అందించారు. ఆంధ్రప్రదేశ్లోని అరుదైన చంద్రకాంత రాయిని ఉపయోగించి తయారుచేసిన రామెన్ బౌల్స్తో పాటు వెండి చాప్స్టిక్స్ను జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతోకు బహూకరించారు. అలాగే, జమ్మూకశ్మీర్ హస్తకళా వైశిష్ట్యాన్ని ప్రతిబింబించే పశ్మీనా శాలువను ప్రధాని సతీమణికి గిఫ్ట్గా అందించారు. ఈ శాలువను అందించడానికి, కాగితపు గుజ్జు, జిగురు,ఇతర సహజ సామగ్రిని కలిపి, చేతితో కళాత్మకంగా తయారుచేసిన అందమైన పెట్టెలో సమకూర్చారు.
వివరాలు
రాజస్థాన్లోని పార్చిన్ కారి శైలి
రామెన్ బౌల్స్ తయారీలో ఉపయోగించిన చంద్రకాంత రాయి ప్రేమ, సమతుల్యత మరియు రక్షణ భావాలను సూచిస్తుంది. రామెన్ బౌల్ అడుగు భాగాన్ని రాజస్థాన్లోని పార్చిన్ కారి శైలిలో, అరుదైన రాళ్లతో పొదిగిన మక్రానా పాలరాయితో తయారుచేశారని సమాచారం లభించింది. జపాన్ నుంచి చైనాకు బయల్దేరే ముందు మోదీ ఈ ప్రత్యేక బహుమతులను అందించారు.
వివరాలు
రేపు ఎస్సీవో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనున్న మోదీ
శనివారం, జపాన్లో తన రెండు రోజుల పర్యటనను ముగించిన తరువాత, ప్రధాని మోదీ అక్కడి నుండి చైనా బయల్దేరారు. రేపు తియాజింగ్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. తన జపాన్ పర్యటన ద్వారా భారత ప్రజలకు ఉపయోగకరమైన ఫలితాలు సాధించానని, ఈ పర్యటనను ఎప్పటికీ మరచిపోలేనని మోదీ వ్యక్తపరిచారు. జపాన్ ప్రజలు, ప్రధానిగా ఇషిబాతో సహా, తనపై ఎంతో ఆప్యాయత చూపినందుకు మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.