NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు
    తదుపరి వార్తా కథనం
    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు
    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు

    RAPIDX Train : 'ర్యాపిడ్‌'ఎక్స్‌ రైళ్లు దూసుకొచ్చేస్తున్నాయి.. ఇవే వాటి ప్రత్యేకతలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 19, 2023
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలు పట్టాలెక్కనుంది.ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కేంద్రం మరో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

    శుక్రవారం రాజధాని ప్రాంతంలో భారత తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

    గంటకు 160 కి.మీల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అధునాతన వసతులను పొందుపర్చారు. దేశంలోనే తొలిసారిగా దిల్లీ- ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ రైలు దూసుకెళ్లనుంది.

    సాహిబాబాద్‌,దుహై మధ్య 17కి.మీల ప్రాధాన్యత కలిగిన కారిడార్‌లో ర్యాపిడ్‌ఎక్స్‌ రైలుకు మోదీ పచ్చజెండా ఊపనున్నారు.

    సాహిబాబాద్ నుంచి దుహై మధ్య 5 స్టేషన్ల (సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో) మీదుగా సర్వీసులందిస్తుంది.

    Details

    అక్టోబర్‌ 21 నుంచి అందుబాటులోకి రానున్న రైలు  

    'RAPID'X రైళ్లు పూర్తిగా ఎయిర్‌ కండిషన్డ్‌ రైలు. అక్టోబర్‌ 21 నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

    ప్రతి రైలులో 2×2 లే అవుట్‌లో సీట్లు, నిల్చునేందుకు విశాలమైన ప్రదేశం, లగేజ్‌ ర్యాక్‌లు, సీసీటీవీ కెమెరాలతో పాటు అత్యవసరమైన డోర్‌ ఓపెనింగ్‌ మెకానిజం, మొబైల్‌ ఛార్జింగ్‌ పాయింట్లు, డైనమిక్ రూట్‌ మ్యాప్‌లు, ఆటో కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ సిస్టమ్, హీటింగ్ వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ తదితర సౌకర్యాలు ఈ రైలు ఇమిడించుకోనుంది.

    ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందించే RAPIDX రైళ్లు, ప్రతి 15 నిమిషాలకు చొప్పున సర్వీసులు అందించనుంది.

    ప్రతి రైలులోనూ ఆరు కోచ్‌లు ఉంటాయి. ఒకేసారి 1700 మంది కూర్చొని, నిలబడి ప్రయాణించేలా రూపొందించారు.

    details

    మహిళలకు ప్రత్యేకమైన కోచ్

    అయితే స్టాండర్డ్‌ కోచ్‌ల్లో కనీస టిక్కెట్ ధర రూ.20, గరిష్ఠ ధరను రూ.50గా నిర్ణయించారు.

    ప్రీమియం కోచ్‌ల్లో రూ.40, కాగా, గరిష్ఠ ధర రూ.100గా ఫిక్స్ చేశారు. ప్రతి రైలులో మహిళల కోసం ప్రత్యేక కోచ్‌ ఉంటుంది.

    ప్రీమియం కోచ్‌లో వెనుకకు వాలి కూర్చొనేలా సీట్లతో పాటు కోట్ హుక్స్, మ్యాగజైన్ హోల్డర్‌లు, ఫుట్‌ రెస్ట్‌లు లాంటి స్పెషల్ ఫీచర్లున్నాయి.

    ప్రీమియం కోచ్‌లోకి ప్రవేశించేందుకు ప్లాట్‌ఫాంలోని ప్రీమియం లాంజ్‌ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. సౌకర్యవంతమైన కుషన్‌ సీట్లను ఏర్పాటు చేశారు.

    ప్రతి రైలులోని ప్రీమియం కోచ్‌లో ప్రయాణికుల సహాయార్థం సిబ్బందిని కేటాయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ

    తాజా

    UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌ వ్యాపారవేత్త అరెస్ట్‌  ఉత్తర్‌ప్రదేశ్
    IPL 2025: ప్లేఆఫ్స్ రేసులో ముంబయి, ఢిల్లీకి ఇంకా ఆశలు ఉన్నాయా? ఐపీఎల్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ.. ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్టాక్ మార్కెట్
    Naveen Polishetty: మణిరత్నం దర్శకత్వంలో నవీన్‌ పోలిశెట్టి.. క్రేజీ కాంబో రాబోతుందా? టాలీవుడ్

    నరేంద్ర మోదీ

    మరోసారి తెలంగాణ గడ్డ మీదకు మోదీ.. బీజేపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ బీజేపీ
    ఆ మూడు రాష్ట్రాల్లా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరగలేదు: లోక్‌సభలో ప్రధాని మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 2023
    నేడు సాయంత్రం 6:30 గంటలకు ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్  ప్రధాన మంత్రి
    ఫాక్స్‌కాన్ సంచలన ప్రకటన.. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి అపూర్వ బహుమతి తైవాన్

    దిల్లీ

    G20 Delhi Declaration: దిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించిన జీ20 దేశాధినేతలు: ప్రధాని మోదీ ప్రకటన  నరేంద్ర మోదీ
    దిల్లీలోని అక్షరధామ్ ఆలయంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ పూజలు  రిషి సునక్
    రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించిన జీ20 దేశాధినేతలు  జీ20 సదస్సు
    G20 summit: ముగిసిన దిల్లీ జీ20 సమ్మిట్.. బ్రెజిల్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ  జీ20 సమావేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025