NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
    తదుపరి వార్తా కథనం
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

    వ్రాసిన వారు Stalin
    Feb 02, 2023
    09:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నేపాల్ నుంచి అరుదైన రెండు సాలిగ్రామ శిలలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిలలతో గర్భగుడిలో శ్రీరాముడు, సీతమ్మ తీర్చిదిద్దనున్నారు.

    విశ్వహిందూ పరిషత్‌ జాతీయ కార్యదర్శి రాజేంద్ర సింగ్‌ పంకజ్‌ నేపాల్‌లోని ముస్తాంగ్‌ జిల్లా నుంచి రెండు సాలిగ్రామ శిలలను తీసుకొచ్చినట్లు

    ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, బాబ్రీ మసీదు స్థలంలో అయోధ్యలో కొత్త రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది.

    రామమందిర నిర్మాణ కోసం వివాదాస్పద స్థలంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సుమారు 2.77 ఎకరాలు మంజూరు చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్టు రూ. 1,800 కోట్ల వ్యయంతో రామ మందిరాన్ని నిర్మిస్తోంది.

    అయోధ్య

    6కోట్ల ఏళ్ల నాటి సాలిగ్రామ శిలలు

    అయోధ్యకు చేరుకున్న రెండు సాలిగ్రామ శిలలకు 6కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. రెండు వేర్వేరు ట్రక్కులపై శిలలను అయోధ్యకు తీసుకొచ్చారు. అందులో ఒకటి 26 టన్నుల బరువు ఉండగా, మరొకటి 14 టన్నుల బరువు ఉంటుంది. శిలలు అయోధ్యకు చేరుకోగానే, పూజారులు పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు.

    నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో గండకీ నదిలో శిలలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి శ్రీరాముడు, సీతా దేవి ఉత్సవ విగ్రహాలు సిద్ధం కానున్నాయి.

    సాలిగ్రామ శిలను హిందువులు శ్రీ విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే ప్రత్యేకంగా పవిత్ర స్థలంగా భావించే గండకీ నదిలో ఈ శిలలను వెతికి మరీ తీసుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నేపాల్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    నేపాల్

    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! విమానం
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం విమానం
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025