NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
    భారతదేశం

    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 02, 2023, 09:34 pm 0 నిమి చదవండి
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు
    శ్రీరాముడి విగ్రహం నిర్మాణం కోసం అయోధ్యకు చేరుకున్న అరుదైన శిలలు

    నేపాల్ నుంచి అరుదైన రెండు సాలిగ్రామ శిలలు గురువారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నాయి. ఈ శిలలతో గర్భగుడిలో శ్రీరాముడు, సీతమ్మ తీర్చిదిద్దనున్నారు. విశ్వహిందూ పరిషత్‌ జాతీయ కార్యదర్శి రాజేంద్ర సింగ్‌ పంకజ్‌ నేపాల్‌లోని ముస్తాంగ్‌ జిల్లా నుంచి రెండు సాలిగ్రామ శిలలను తీసుకొచ్చినట్లు ఫిబ్రవరి 2020లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, బాబ్రీ మసీదు స్థలంలో అయోధ్యలో కొత్త రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. రామమందిర నిర్మాణ కోసం వివాదాస్పద స్థలంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు సుమారు 2.77 ఎకరాలు మంజూరు చేశారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్టు రూ. 1,800 కోట్ల వ్యయంతో రామ మందిరాన్ని నిర్మిస్తోంది.

    6కోట్ల ఏళ్ల నాటి సాలిగ్రామ శిలలు

    అయోధ్యకు చేరుకున్న రెండు సాలిగ్రామ శిలలకు 6కోట్ల ఏళ్ల చరిత్ర ఉంది. రెండు వేర్వేరు ట్రక్కులపై శిలలను అయోధ్యకు తీసుకొచ్చారు. అందులో ఒకటి 26 టన్నుల బరువు ఉండగా, మరొకటి 14 టన్నుల బరువు ఉంటుంది. శిలలు అయోధ్యకు చేరుకోగానే, పూజారులు పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో గండకీ నదిలో శిలలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి శ్రీరాముడు, సీతా దేవి ఉత్సవ విగ్రహాలు సిద్ధం కానున్నాయి. సాలిగ్రామ శిలను హిందువులు శ్రీ విష్ణువు అవతారంగా భావిస్తారు. అందుకే ప్రత్యేకంగా పవిత్ర స్థలంగా భావించే గండకీ నదిలో ఈ శిలలను వెతికి మరీ తీసుకొచ్చారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    నేపాల్

    తాజా

    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్
    టీమిండియా ప్లేయర్లకు స్వల్ప విరామం టీమిండియా
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ ఎన్టీఆర్ 30
    మార్చి 23న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    నేపాల్

    నేపాల్‌లో 5.2 తీవ్రతతో భూకంపం; కూలిన భవనాలు భూకంపం
    ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్న ఆసిఫ్ షేక్ క్రికెట్
    దిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు దిల్లీ
    ఈ దేశాల్లో మన రూపాయి వీలువ చాలా ఎక్కువ, అవేంటో తెలుసా? జీవనశైలి

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023