రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ విద్యుదుత్పత్తి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. శనివారం 105.620 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని నమోదు చేసింది.
శుక్రవారం అర్ధరాత్రి 12 నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకూ సుమారు 114 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేయగా.. జెన్ కో వినియోగానికి పోనూ 105.620 మిలియన్ యూనిట్లు గ్రిడ్ కు సరఫరా చేసింది.
ఒక్క రోజులో 5137 మెగావాట్లను సొంతంగా అందించడం ఓ రికార్డు అని జెన్ కో అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒకరోజులో ఇదే అత్యధిక ఉత్పత్తిగా నిలిచింది. రికార్డు స్థాయి ఉత్పత్తి సాధించినందుకు ఏపీ జెన్ కో ఉద్యోగులను మేనేజింగ్ డైరక్టర్ చక్రధర్ బాబు అభినందనలు తెలిపారు.
Details
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ లో నూతనంగా మరో కొత్త యూనిట్
వేసవి తీవ్రత కారణంగా విద్యుత్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలను తీర్చడానికి మరింత అంకిత భావంతో పనిచేయాలని ఉద్యోగులకు తెలియజేశారు.
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వ సహకారంతో ఏపీ జెన్ కో అన్ని చర్యలు తీసుకుంటోందని ఎండీ వెల్లడించారు.
విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన కొత్త యూనిట్ విద్యుదుత్పత్తిని త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
లోయర్ సీలేరులో మరో 230 మెగావాట్ల ఉత్పత్తి కోసం రెండు యూనిట్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టి ఏడాదిలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.