Page Loader
Hyderabad: గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు
గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు

Hyderabad: గచ్చిబౌలి స్థలానికి రికార్డు రేటు.. గజం రూ.2.22 లక్షలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 24, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని ఓ వాణిజ్య స్థలం గజం ధర ఏకంగా రూ.2.22 లక్షలు పలకడం విశేషం. సోమవారం హైదరాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలాల వేలాన్ని కేపీహెచ్‌బీలో నిర్వహించారు, ఇందులో 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో మొత్తం 4 స్థలాలను వేలం వేయగా అవన్నీ అమ్ముడుపోయాయి. ముఖ్యంగా, కుక్కలపార్క్‌కు ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం గజం రూ.1.20 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.2.22 లక్షలకుపైగా పెరిగింది. ఫలితంగా ఈ స్థలం రూ.33 కోట్లకే విక్రయించారు.

Details

ప్రభుత్వానికి రూ.65 కోట్లు ఆదాయం

మరోవైపు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్‌లోని ఎంజీఐ 10 ప్లాట్లకుగాను 3 అమ్ముడుపోగా, రూ.8.11 కోట్ల ఆదాయం వచ్చింది. బాచుపల్లిలో 8 ప్లాట్లు వేలంలో పెట్టగా 4 ప్లాట్లు అమ్ముడుపోయాయి. వీటిలో బీ-1 బ్లాక్‌లోని ఎఫ్‌17 ప్లాటు అత్యధికంగా రూ.18.21 లక్షల ధర పలికింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వం మొత్తంగా రూ.65 కోట్ల ఆదాయం రాబట్టింది. ఇందులో గచ్చిబౌలిలోని స్థలాల ద్వారానే రూ.55.56 కోట్లు సమకూరినట్టు హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు.