NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 
    తదుపరి వార్తా కథనం
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 
    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; 25శాతం వృద్ధి నమోదు

    భారతీయ రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం; ఏడాదిలో 25శాతం వృద్ధి నమోదు 

    వ్రాసిన వారు Stalin
    Apr 18, 2023
    01:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ. 2.40 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

    ఏడాదిలో 25 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు పేర్కొంది. అంటే గతేడాది కంటే రూ.49,000 కోట్లు ఎక్కువ ఆదాయాన్ని పొందినట్లు భారతీయ రైల్వే చెప్పింది.

    ఈ ఆర్థిక సంవత్సరంలో సరుకు రవాణా ఆదాయం రూ. 1.62 లక్షల కోట్లకు పెరిగింది, ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 15 శాతం వృద్ధి. రైల్వే ప్రయాణీకుల ఆదాయం 61 శాతం వృద్ధితో రూ.63,300 కోట్లకు చేరుకుంది.

    మూడేళ్ల తర్వాత జాతీయ క్యారియర్ పెన్షన్ ఖర్చులను పూర్తిగా భరించగలదని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    రైల్వే

    ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయంలో 61శాతం వృద్ధి 

    ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం పరంగా 2021-22లో రూ. 39,214 కోట్లు ఉంటగా, 2022-23లో ప్రయాణీకుల ఆదాయం రూ. 63,300కోట్లు ఆర్జించింది.

    ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 61శాతం ఎక్కువ. రైల్వే తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టిందని, 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా కొత్త లైన్‌లను ప్రారంభించడం, 5243 కి.మీల డబ్లింగ్/మల్టీ-ట్రాకింగ్‌ పనులను మొదలు పెట్టింది.

    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని సాధించే దిశగా భారతీయ రైల్వే ముందుకుసాగుతోంది.

    భారతీయ రైల్వే 170 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే శాఖ మంత్రి
    వృద్ధి రేటు
    తాజా వార్తలు

    తాజా

    Gold prices: తెలుగు రాష్ట్రాల్లో దిగొచ్చిన బంగారం ధరలు.. ఇవాళ్టి ధరలు ఎలా ఉన్నాయంటే?  బంగారం
    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ

    రైల్వే శాఖ మంత్రి

    సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    సీసీ కెమెరా నిఘాలో రైల్వే కోచ్‌లు.. ఇక రైలు ప్రయాణం మరింత భద్రం భారతదేశం
    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    వృద్ధి రేటు

    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలమైనది: ఐఎంఎఫ్ చీఫ్ ప్రశంసలు  ఆర్ బి ఐ

    తాజా వార్తలు

    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?  ఉత్తర్‌ప్రదేశ్
    వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్‌ వ్యూహాత్మక డీల్ పూర్తి  రిలయెన్స్
    అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు పంజాబ్
    మొజాంబిక్‌లో 'మేడ్ ఇన్ ఇండియా' రైలులో ప్రయాణించిన జైశంకర్  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025