NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
    రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

    Delhi CM Oath Ceremony: రామ్‌లీలా మైదానంలో ఇవాళ రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 20, 2025
    09:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బీజేపీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. దిల్లీ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తాకు బాధ్యతలు అప్పగించింది.

    26ఏళ్ల విరామం తర్వాత హస్తినాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, కీలకమైన ఈ నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతానికి 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ ఎక్కడా మహిళా సీఎం లేకపోవడంతో, ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని పార్టీ అమలు చేసింది.

    శాలీమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి వందన కుమారిపై 29,595 ఓట్ల భారీ మెజారిటీతో రేఖా గుప్తా గెలుపొందారు.

    48 మంది బీజేపీ ఎమ్మెల్యేల సమక్షంలో, పార్టీ కేంద్ర పరిశీలకులు రవి శంకర్ ప్రసాద్, ఓపీ ధన్‌ఖడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రేఖా గుప్తా(ఓబీసీ నేత)ను శాసనసభా పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    Details

    నాలుగో మహిళ ముఖ్యమంత్రిగా రికార్డు

    ఆమె పేరును సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీయే నేతల సమక్షంలో రేఖా గుప్తా దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీ మర్లేనా తర్వాత దిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న నాలుగో మహిళగా ఆమె నిలుస్తారు.

    ముఖ్యమంత్రి పదవికి ముందుండి ప్రధాన పోటీదారుడిగా ఉన్న పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మకు నిరాశ ఎదురైంది.

    మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడైన ఆయన, ఆప్ అధినేత, మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించినప్పటికీ సీఎం రేసులో వెనుకబడ్డారు.

    Details

    25వేల మంది భద్రతా సిబ్బంది

    రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలతో కలిసి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో సమావేశమై, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఆమెను అధికారికంగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.

    దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో వేలాది మంది ప్రజల సమక్షంలో రేఖా గుప్తా ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

    ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు ఎన్డీయే నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సుమారు 25 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దిల్లీ
    బీజేపీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    నరేంద్ర మోదీ

    PM Modi: ఫిబ్రవరిలో ప్రధాని మోదీతో పాడ్‌కాస్ట్.. లెక్స్‌ ఫ్రిడ్‌మాన్ ప్రకటన అమెరికా
    Narendra Modi: ఎన్నికల సంఘంపై ప్రధాని మోదీ పొగడ్తల వర్షం ఎన్నికల సంఘం
    PM Modi: బేటీ బచావో, బేటీ పడావో' ఉద్యమానికి 10 ఏళ్లు.. ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్‌ వైరల్  భారతదేశం
    Narendra Modi : మహనీయుల సేవలను స్మరించుకుందాం : నరేంద్ర మోదీ అమిత్ షా

    దిల్లీ

    FIITJEE Coaching Center: టీచర్ల జీతాలు చెల్లించకపోవడంతో యూపీ, ఢిల్లీలో ఫిట్జ్ కోచింగ్ కేంద్రాలు మూసివేత‌ ఉత్తర్‌ప్రదేశ్
    Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదిక ప్రవేశపెట్టేలా ఆదేశాలంటూ పిటిషన్.. నిరాకరించిన కోర్టు   భారతదేశం
    BJP: మూడేళ్లలో యమునా నదిని పూర్తిగా శుభ్రం చేస్తాం : అమిత్ షా అమిత్ షా
    Murder: గొంతు కోసి చంపాడు.. లివ్ ఇన్ రిలేషన్‌లో మరో హత్య హత్య

    బీజేపీ

    Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్ కాంగ్రెస్
    "Fake Voters": ఢిల్లీ ఎన్నికలకు ముందు బీజేపీ,ఆప్ పోస్టర్ వార్ ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Delhi: ఢిల్లీ బీజేపీ చీఫ్ కీలక నిర్ణయం.. పోటీకి దూరంగా వీరేంద్ర సచ్‌దేవా! దిల్లీ
    Ramesh Bidhuri: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత ప్రియాంక గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025