NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
    తదుపరి వార్తా కథనం
    Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!
    ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!

    Reliance In AP: ఏపీలో రిలయన్స్ భారీ పెట్టుబడి.. 500 బయో గ్యాస్ ప్లాంట్లకు గ్రీన్ సిగ్నల్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 26, 2025
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

    రాష్ట్రంలో మొత్తం 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లను నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ రూ.65 వేల కోట్ల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.

    ఈ ఒప్పందం ప్రకారం, తొలి దశలో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.

    మంగళవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను సచివాలయంలో కలిశారు.

    ఈ సందర్భంగా ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి కోరారు. మొదటి దశలో ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని బంజరు భూముల్లో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    Details

    కనిగిరిలో మొదటి ప్లాంట్

    ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన భూమిని అందించేందుకు రెవెన్యూశాఖ మంత్రిని కోరినట్లు వెల్లడించారు.

    రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి.

    తొలి ప్లాంట్‌ను ప్రకాశం జిల్లా కనిగిరిలో నెలకొల్పనున్నారు.

    ఈ ప్రాజెక్ట్ కోసం కనిగిరిలో 4,000 ఎకరాల బంజరు భూమిని గుర్తించారు. ప్రభుత్వ భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.15,000, ప్రైవేట్ భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.30,000 చెల్లించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

    రైతులతో చర్చించి వీలైనంత త్వరగా భూసేకరణను పూర్తి చేయాలని యోచిస్తున్నారు.

    మొత్తం 500 ప్లాంట్ల ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత, దాదాపు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    రిలయెన్స్

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    ఆంధ్రప్రదేశ్

    Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌! భారతదేశం
    Talliki Vandanam: తల్లికి వందనం పథకం అమలు పై ఏపీ ప్రభుత్వం కసరత్తు.. విధి విధానాలు ఇవే..! భారతదేశం
    Speaker Ayyanna Patrudu: ప్రతిపక్ష హోదా జగన్‌కు లేదు.. ప్రజలు ఆ హోదా ఇవ్వలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    CM Chandrababu: ఏపీ బడ్జెట్ సమావేశాల ముందు సీఎం కీలక సమావేశం.. ఫైళ్ల క్లియరెన్స్, పథకాల అమలుపై సమీక్ష  చంద్రబాబు నాయుడు

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025