Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa)పై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో న్యాయస్థానం కొంతవరకు ఊరట ఇచ్చింది.
ఇటీవల ఫాస్ట్ ట్రాక్ కోర్టు మార్చి 15న పోక్సో (Pocso) కేసు విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది.
అయితే, తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.
వివరాలు
పోక్సో చట్టం కింద కేసు
17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే.
ఓ మోసం కేసులో సహాయం కోరేందుకు బాధితురాలు, ఆమె తల్లి గతేడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు.
ఆ సమయంలో భాజపా నేత తన కుమార్తెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి గురిచేశారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
అయితే, ఈ ఆరోపణలను ఆయన కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయాన్ని పేర్కొంది.