Page Loader
Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట 
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట

Yediyurappa: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రికి కర్ణాటక హైకోర్టులో స్వల్ప ఊరట 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 14, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప (BS Yediyurappa)పై మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో న్యాయస్థానం కొంతవరకు ఊరట ఇచ్చింది. ఇటీవల ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు మార్చి 15న పోక్సో (Pocso) కేసు విచారణకు హాజరుకావాలని ఆయనను ఆదేశించింది. అయితే, తాజాగా కర్ణాటక హైకోర్టు ఆ కేసుకు సంబంధించిన సమన్లను నిలిపివేసింది.

వివరాలు 

 పోక్సో చట్టం కింద కేసు 

17 ఏళ్ల బాలికపై యడియూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. ఓ మోసం కేసులో సహాయం కోరేందుకు బాధితురాలు, ఆమె తల్లి గతేడాది ఫిబ్రవరి 2న యడియూరప్పను కలిశారు. ఆ సమయంలో భాజపా నేత తన కుమార్తెను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి గురిచేశారని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో యడియూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే, ఈ ఆరోపణలను ఆయన కార్యాలయం ఖండించింది. ఫిర్యాదుదారు గతంలోనూ పలువురిపై ఇలాంటి ఆరోపణలు చేసిన విషయాన్ని పేర్కొంది.