NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం
    తదుపరి వార్తా కథనం
    Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం
    భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం

    Petrol prices: భారత ప్రజలకు పెట్రో ధరల నుంచి ఊరట.. క్రూడ్‌ ధరల భారీ పతనం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 12, 2024
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్‌ చమురు ధర రూ.80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్‌ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.

    మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారత పౌరులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్‌ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది.

    ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్‌ సూచనప్రాయంగా వెల్లడించారు.

    అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    Details

    మూడేళ్ల కనిష్ఠానికి చేరుకున్న క్రూడాయిల్ ధర

    అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర మూడేళ్ల కనిష్ఠానికి చేరింది.

    2021 డిసెంబర్‌ తర్వాత బ్యారెల్‌ చమురు ధర మంగళవారం 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం.

    క్రూడ్‌ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌+ దేశాలు భావిస్తుండగా.. ఉత్పత్తిని పెంచాలని భారత్‌ కోరుతోంది.

    మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్‌ ఆయిల్‌ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

    Details

    ధరలు తగ్గించే అవకాశం

    దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏడాది మార్చిలో పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ ధరలను లీటరుకు రూ.2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది.

    జమ్ము-కశ్మీర్, హరియాణ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి పెట్రో ధరల కోతకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    దేశంలో 90 శాతం పెట్రోల్ పంపులు ప్రభుత్వ అధీనంలోనే ఉండడంతో ప్రైవేటు రంగ కంపెనీలూ ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెట్రోల్
    డీజిల్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    పెట్రోల్

    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా గ్యాస్
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    డీజిల్

    డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక ఎలక్ట్రిక్ వాహనాలు
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు  చమురు
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025