NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
    తదుపరి వార్తా కథనం
    SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!
    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

    SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 25, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో (SLBC టన్నెల్)మరో మృతదేహం ఆనవాళ్లు కనుగొన్నారు.

    తవ్వకాలు నిర్వహిస్తున్న సమయంలో లోకో ట్రాక్ వద్ద మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడినట్లు తెలుస్తోంది.

    దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ ఆనవాళ్లు లభ్యమయ్యాయి.

    అనుమానిత ప్రాంతాలైన డీ1, డీ2 కాకుండా మరొక ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.

    అయితే, ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.దీనికి సంబంధించి అధికారులు టన్నెల్ లోపలికి వెళ్లారు.

    లభించిన ఆనవాళ్లు నిజంగానే మృతదేహానివే అయితే సాయంత్రం వరకు దాన్ని బయటకు తీసే అవకాశం ఉందని సమాచారం.

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతైన సంగతి తెలిసిందే.

    వివరాలు 

    ఇక ముందుకు వెళ్లలేం! 

    ఈ ప్రమాదం జరిగిన ఒక నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఒకరి మృతదేహమే లభ్యమైంది.

    ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు.

    ఈ సందర్భంగా టన్నెల్‌లో అన్వేషణ కొనసాగించడం ఇక సాధ్యం కాదని రెస్క్యూ అధికారులు వెల్లడించినట్టు సమాచారం.

    ప్రమాదం జరిగిన ప్రాంతంలో టన్నెల్ పైకప్పు బలహీనంగా మారిపోయిందని, అది మరింత కూలిపోయే ప్రమాదం ఉన్నదని, ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తే రెస్క్యూ బృందం కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.

    అయితే, గల్లంతైన ఏడుగురు కార్మికుల ఆచూకీ లభించే వరకు అన్వేషణ కొనసాగించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించినట్టు సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    తెలంగాణ

    Medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో,నిర్వహణలో, నాణ్యతలోనూ వైఫల్యాలు.. తుది నివేదికలో 'విజిలెన్స్‌' భారతదేశం
    Half Day Schools: తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు  భారతదేశం
    TGPSC Group-3: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్షల ఫలితాలు విడుదల.. జనరల్‌ ర్యాంకింగ్స్‌ జాబితా ఇదిగో.. భారతదేశం
    TG News: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025