NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు
    తదుపరి వార్తా కథనం
    Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు
    పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు

    Telangana: పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అధికారులు ఆంక్షలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 05, 2024
    12:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో భారీ వర్షాల వల్ల వాగులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి, దీనితో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.

    వర్షాలు, వరదల ప్రభావం వల్ల పర్యాటకులకు కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉన్నాయి, కాబట్టి పర్యాటకులు కొద్దీ రోజుల పాటు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

    ములుగు జిల్లాలో బాగా వర్షాలు కురుస్తున్నాయి, ఇక్కడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

    వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు పర్యాటకులు బొగత జలపాతం, లక్నవరం సరస్సు, రామప్ప సరస్సు, సమ్మక్క-సారలమ్మ దేవాలయాన్ని సందర్శించకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

    స్థానికులు,ఇతర జిల్లాల సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.

    వివరాలు 

    పాకాల సరస్సు వద్ద ఆంక్షలు

    ప్రజల భద్రత కోసం ములుగు జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు.

    గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    చేపల వేటకు తాత్కాలికంగా నిషేధం విధించారు. పెద్ద వర్షాల కారణంగా చెరువులు, వాగులు, కాలువల్లో ఈత కొట్టడాన్ని నిషేధించారు.

    వరంగల్ జిల్లా పాకాల సరస్సు వద్ద కూడా ఆంక్షలు అమలులో ఉన్నాయి. పాకాల మత్తడి పోస్తున్న కారణంగా అక్కడకు అనుమతి ఇవ్వడం లేదు.

    నర్సంపేట నుంచి పాకాల వైపు వెళ్లే మార్గంలో అశోక్ నగర్ దాటిన తర్వాత వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది,కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

    కొత్తగూడెం,గుంజేడు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    వివరాలు 

    ఉధృతంగా మాధన్నపేట వాగు.. 

    నర్సంపేట మండలం మాధన్నపేట చెరువు మత్తడి పోస్తోంది, దాంతో మాధన్నపేట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

    ఈ నేపథ్యంలో మత్తడి వద్దకు వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున నర్సంపేట-మాధన్నపేట, నర్సంపేట చెన్నారావుపేట మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ములుగు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    తెలంగాణ

    Ration Card: రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సన్నబియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్  ఇండియా
    Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం రేవంత్ రెడ్డి
    Nalgonda : నల్గొండ జిల్లాలో దారుణం.. తల్లిని చంపి కుమారుడు ఆత్మహత్య ఆత్మహత్య
    Hydra : 18 ప్రాంతాల్లో కూల్చివేతలు.. ఆక్రమిత కట్టడాలపై హైడ్రా నివేదిక హైదరాబాద్

    ములుగు

    Sammakka Saralamma Tribal University : ములుగు గిరిజన వర్సిటీకి లోక్‌సభ ఆమోదం లోక్‌సభ
    Seethakka: త్వరలో 14వేల అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేస్తాం: మంత్రి సీతక్క ఎమ్మెల్యే
    Medarama Jatara: మేడారం జాతరకు భారీ బందోబస్తు.. 14 వేల మంది పోలీసుల మోహరింపు  తాజా వార్తలు
    Mulugu: ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ అనుమానాస్పద మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025