NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి
    రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

    Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్‌.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 09, 2025
    12:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఇటీవలే వివిధ శాఖల్లో రీ-అపాయింట్మెంట్, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాల్లో కొనసాగుతున్న ఉద్యోగులను ఉద్వాసన పలికిన ప్రభుత్వం.. మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని వెల్లడించింది.

    హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL), హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (HAML) ఎండీగా ఎన్వీఎస్ రెడ్డిని మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిశోర్ నుంచి అధికారిక ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించిన ప్రాజెక్టు ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో ప్రారంభం నుంచే మెట్రో ప్రాజెక్టుకు నడిపిన ఎన్వీఎస్ రెడ్డి అనుభవం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

    Details

    మెట్రో సేవలను విస్తరించేందుకు కృషి

    అందుకే ఆయనను మరో ఏడాది పాటు హెచ్ఎంఆర్ఎల్, హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతం మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టు భాగంగా ఓల్డ్ సిటీ, ఎయిర్‌పోర్ట్, ఫోర్త్ సిటీ, నార్త్ సిటీ లాంటి ప్రాంతాలకు మెట్రో సేవలు విస్తరించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది.

    ఈ ప్రాజెక్టు మొత్తం రెండు భాగాలుగా - పార్ట్-ఏ(5 కారిడార్లు), పార్ట్-బీ(3 కారిడార్లు)గా విభజించగా, పార్ట్-ఏకి చెందిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి పంపారు.

    కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభించిన వెంటనే పనులను వేగంగా ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఎన్వీఎస్ రెడ్డి సేవలు కొనసాగించనున్నారు.

    ఇక ఇటీవలే ప్రభుత్వం మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో 177 మంది, పంచాయతీ రాజ్ శాఖలో 47 మందిని తొలగించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    హైదరాబాద్

    తాజా

    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    Upcoming IPOs: స్టాక్ మార్కెట్లో లిస్టింగ్‌ల జోరు.. ఒకే ఒక్క కంపెనీకి సబ్‌స్క్రిప్షన్ అవకాశం స్టాక్ మార్కెట్

    తెలంగాణ

    TGPSC: గ్రూప్-1 పేపర్లు రీవాల్యుయేషన్‌కు హైకోర్టులో పిటిషన్.. టీజీపీఎస్సీకి నోటీసులు హైకోర్టు
    Betting Apps Promotion: బెట్టింగ్ యాప్ విచారణ కేసులో ఊహించని ట్విస్ట్.. సంస్థలపైకి దృష్టి భారతదేశం
    Telangana cabinet: మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ .. ఈ విడతలో నలుగురికి అవకాశం? భారతదేశం
    SLBC Tunnel : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..! భారతదేశం

    హైదరాబాద్

    MMTS: చర్లపల్లి నుంచి మరిన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లు.. కొత్త సర్వీసుల ప్రారంభం!  తెలంగాణ
    Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు! భారతదేశం
    House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్‌.. 'స్క్వేర్‌ యార్డ్స్‌' నివేదిక  భారతదేశం
    GHMC : హైదరాబాద్‌లో కొత్త టూరిస్ట్ స్పాట్.. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025