NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
    తదుపరి వార్తా కథనం
    Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
    సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

    Bandi Sanjay: సినీ పరిశ్రమపై పగబట్టిన రేవంత్‌ రెడ్డి.. బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 22, 2024
    01:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రమంత్రి బండి సంజయ్‌ సీఎం రేవంత్‌ రెడ్డిని తీవ్ర విమర్శలు గుప్పించారు.

    ఆయన సినీ పరిశ్రమపై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారని, ఇందులో భాగంగానే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

    సంధ్య థియేటర్‌ ఘటనలో మహిళ మృతికి సంబంధించి అందరూ విచారం వ్యక్తం చేశారని, బాధితుల కుటుంబాలకు మద్దతుగా నిలిచారని చెప్పారు.

    అలాగే గాయపడిన శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారని గుర్తు చేశారు.

    ఘటన ముగిసిన తర్వాత, అసెంబ్లీ వేదికగా ఎంఐఎం సభ్యుల ద్వారా ప్రశ్న అడిగించి వివాదం కల్పించారని బండి సంజయ్‌ విమర్శించారు.

    అసలు ప్రణాళిక ప్రకారం సినీ పరిశ్రమను దెబ్బతీయడానికి, అల్లు అర్జున్‌ వ్యక్తిత్వంపై నిందలు వేయడానికి కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు.

    Details

    సినీ ఇండస్ట్రీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం

    ఇది స్పష్టంగా సినీ ఇండస్ట్రీని తక్కువ చేయడానికి, వారి ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరిగిన ప్రయత్నమన్నారు.

    బండి సంజయ్‌ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై ఇతర అంశాల్లోనూ దాడి చేశారు. గురుకుల విద్యార్థులు కలుషిత ఆహారం తిని మరణిస్తున్నారని, కానీ సీఎం వారి కుటుంబాలను ఏనాడైనా పరామర్శించారా అని పేర్కొన్నారు.

    ఆ మరణాలకు మీ ప్రభుత్వం బాధ్యత వహించిందా? మీకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.

    ఎంఐఎం పార్టీని నమ్మడం వల్ల కాంగ్రెస్‌ కూడా భారాస విధినే అనుభవించబోతోందని బండి సంజయ్‌ హెచ్చరించారు.

    Details

    కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

    గతంలో ఎంఐఎం మాయాజాలానికి బీజేపీ నష్టపోయిందని, ఇప్పుడు అదే ముద్ర కాంగ్రెస్‌ పార్టీపై పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

    సీఎం రేవంత్‌ రెడ్డి కక్ష సాధింపు చర్యలను విడిచిపెట్టాలని, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల సమగ్ర అభివృద్ధిని పక్కనపెట్టడం తగదని బండి సంజయ్‌ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బండి సంజయ్
    కేంద్రమంత్రి

    తాజా

    Shopian: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం జమ్ముకశ్మీర్
    DD Next level: వివాదంలో చిక్కుకున్న ప్రముఖ తమిళ హారర్ కామెడీ చిత్రం 'డీడీ నెక్స్ట్ లెవెల్'  కోలీవుడ్
    operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌లో మా సైనికులు 11 మంది చనిపోయారు: పాక్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Sunil Gavaskar: 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో రోహిత్‌, విరాట్‌ ఆడరు: సునీల్‌ గావస్కర్‌ సునీల్ గవాస్కర్

    బండి సంజయ్

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    చిక్కుల్లో బండి సంజయ్ కుమారుడు, తోటి విద్యార్థులపై దాడి చేసిన వీడియోలు వైరల్ తెలంగాణ
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    కవితపై బండి సంజయ్ కామంట్స్; దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత

    కేంద్రమంత్రి

    కేంద్రం డీఏ పెంపును నేడు ప్రకటించే అవకాశం ప్రభుత్వం
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025