NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి
    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

    ఛత్తీస్‌గఢ్‌లో రోడ్డు ప్రమాదం: ట్రక్కు, వ్యాన్ ఢీకొని 11 మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Feb 24, 2023
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో కనీసం 11మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

    పికప్ వాహనం- ట్రక్కును ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ బఘేల్ తెలిపారు.భటపరా (రూరల్) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమారియా గ్రామంలో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించారు.

    వ్యాను ఒక ఫంక్షన్ నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగ్గా, అందులోని పదకొండు మంది మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

    రోడ్డు ప్రమాదం

    గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు

    స్థానికుల సహాయంతో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ ఆఫీసర్ సిద్ధార్థ బఘేల్ వెల్లడించారు. వారిలో కొందరిని మెరుగైన వైద్య సహాయం కోసం రాయ్‌పూర్‌కు తీసుకెళ్లినట్లు చెప్పారు.

    ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.

    ఇదిలా ఉంటే, ఫిబ్రవరి 9న చత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో-రిక్షా ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, ఒక చిన్నారి మరియు ఆటో డ్రైవర్ గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఛత్తీస్‌గఢ్
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఛత్తీస్‌గఢ్

    ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది గణతంత్ర దినోత్సవం
    బీజేపీ మండలాధ్యక్షుడిని హత్య చేసిన మావోయిస్టులు బీజేపీ
    రాయ్‌పూర్, దుర్గ్-భిలాయ్‌లో 5G సేవలను ప్రారంభించిన ఎయిర్ టెల్ ఎయిర్ టెల్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025