Page Loader
Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం

Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం

వ్రాసిన వారు Stalin
May 11, 2024
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో తూర్పు గోదావరి (East Godavari District)జిల్లా అనంతపురం -నల్లజర్ల రహదారిపై పోలీసులు ₹7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనం విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్తుండగా ఈ వాహనం బోల్తా పడింది. అందులో ఉన్న సంచులను మరో ట్రక్కులోకి ఎక్కిస్తుండగా అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని పరిశీలించగా అందులో రూ. 7 కోట్లు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్​ గా స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం స్థానిక గోపాలపురం ఆసుపత్రికి తరలించారు.

Road Accident-Cash Ceased

రెండ్రోజుల క్రితం రూ.8 కోట్లు స్వాధీనం

రెండ్రోజుల క్రితం ఎన్​టీఆర్​​ జిల్లాలో చెక్​ పాయింట్​ వద్ద ఓ ట్రక్కు నుంచి రూ. 8కోట్ల డబ్బును పోలీస్​ లు పట్టుకున్నారు. వాటికి సరైన ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు దృశ్యాలు