NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
    రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

    Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 28, 2025
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది.

    ఈ పథకం కింద రైతులకు ఏటా రూ.20,000 పెట్టుబడి సాయంగా అందించనున్నారు. అయితే నిధుల జమ విషయంలో స్పష్టత కోసం రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    మూడవిడతలుగా నిధుల విడుదల

    మంగళవారం మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు మూడు విడతల్లో అందిస్తామని తెలిపారు.

    కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

    Details

     పీఎం కిసాన్ + రాష్ట్రం = రూ.20వేలు

    పీఎం కిసాన్ యోజన కింద రూ.6000 కేంద్రం అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 అదనంగా చెల్లించి మొత్తం రూ.20వేలుగా ఈ పథకం అమలవుతుందని సీఎం తెలిపారు.

    రైతులకు సహకారంగా కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్యంలో ఈ స్కీమ్ అమలవుతుందని వివరించారు.

    నిధుల విడుదల ఎప్పుడు?

    పీఎం కిసాన్ యోజన తొలి విడత నిధులను జూన్ నెలలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

    కేంద్ర నిధులు విడుదలైన వెంటనే, రాష్ట్రం నుంచి కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

    అయితే ఈ నిధులు కేవలం ఇకేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో మాత్రమే జమవుతాయి.

    Details

    ఆన్‌లైన్ ద్వారా స్టేటస్ చెక్ చేసే విధానం

    పథకానికి ఇప్పటికే చాలా మంది రైతులు దరఖాస్తు చేశారు. వారు [**https://annadathasukhibhava.ap.gov.in/**](https://annadathasukhibhava.ap.gov.in/) వెబ్‌సైట్‌ ద్వారా తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవచ్చు.

    హోమ్‌పేజ్‌లోని 'Know Your Status' లింక్‌ను క్లిక్ చేసి, ఆధార్ నెంబర్, క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. దీంతో దరఖాస్తు స్టేటస్ కనిపిస్తుంది.

    Details

    ఆఫ్‌లైన్ లోనూ సదుపాయం 

    ఆన్‌లైన్‌ మాత్రమే కాకుండా రైతు సేవా కేంద్రాల్లోనూ స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడ సిబ్బంది తమ లాగిన్‌ ద్వారా రైతుల వివరాలు చెక్ చేసి సమాచారం అందిస్తారు.

    అవసరమైతే జిల్లా వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చు.

    మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి లేదా సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! చంద్రబాబు నాయుడు
    Ayodhya: రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు.. జూన్ 3 నుంచి 5 వరకు కార్యక్రమాలు ఇవే..  అయోధ్య
    Manchu Vishnu: ఎన్నికల కోడ్ కేసు.. సుప్రీంకోర్టును అశ్రయించిన మంచు విష్ణు  మంచు విష్ణు
    Atti Satyanarayana: 'ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేశాడు'.. దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ ఫైర్ దిల్ రాజు

    చంద్రబాబు నాయుడు

    Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్ గేట్స్.. జేపీ నడ్డాతో కీలక చర్చలు బిల్ గేట్స్
    Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు బిల్ గేట్స్
    SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు  భారతదేశం
    AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025