NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర! 
    ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర!

    AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం.. మిథున్‌రెడ్డి కీలక పాత్ర! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    09:40 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం కుంభకోణం చోటుచేసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

    కేవలం కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల మద్యం మాత్రమే విక్రయించేలా పక్కా వ్యూహంతో వ్యవస్థను మార్చినట్లు తెలిపింది.

    ఈ కుంభకోణం వెనుక వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి‌తో పాటు పలువురు శక్తిమంతమైన నాయకులు రూ.3,500 కోట్లు ముడుపులుగా దండుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ హర్జీ దాఖలు చేసింది.

    Details

    వ్యవస్థను చేతికి తీసుకునేందుకు వ్యూహం

    2019 వరకు మద్యం సరఫరా కోసం ఆటోమేటెడ్ విధానం - C-Tel సాఫ్ట్‌వేర్ - ఆధారంగా పనిచేసేది.

    దీని ద్వారా మద్యం డిమాండ్ ప్రకారం సరఫరాదారులకు ఆటోమేటిక్‌గా ఆర్డర్లు విడుదలయ్యేవి.

    అయితే 2019 ఆగస్టు 16న జీఓ నం.357 జారీ చేసి ఏపీ బివరేజెస్ కార్పొరేషన్ (APSBCL) ఏర్పాటయ్యింది.

    తర్వాత ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై APSBCL ఎండీగా, బివరేజెస్, డిస్టిలరీస్ కమిషనర్‌గా నియమించారు.

    Details

    పక్కా ప్లాన్, కుట్ర

    వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, కెసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి తదితరులు కలిసి మద్యం విక్రయాల్లో చేతివాటం చూపేందుకు స్కెచ్ వేశారు.

    APSBCL అధికారులను మేనేజ్ చేస్తూ, అవసరమైన అధికారిక పదోన్నతులు కల్పిస్తామన్న వాగ్దానాలు ఇచ్చారు.

    ఆటోమేటెడ్ విధానాన్ని రద్దు చేసి, మాన్యువల్ విధానం అమలు చేసి, ప్రైవేట్ మెయిల్ ఐడీ ద్వారా ఎంపిక చేసిన బ్రాండ్లకే ఆర్డర్లు జారీ చేయాలని సూచించారు.

    సీ-టెల్ ప్రాజెక్ట్ మేనేజర్ హెచ్చరికలు కూడా పట్టించుకోకుండా కొత్త విధానాన్ని అమలు చేశారు.

    Details

     మద్యం లావాదేవీలు - ముడుపుల వ్యవస్థ

    సొంతంగా మద్యం తయారీ సామర్థ్యం లేని కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చారు.

    రూ.150 నుంచి రూ.600 వరకు కేసుకు ముడుపుల రేట్లు నిర్ణయించి, డేటా ఎన్ట్రీలను విజయసాయిరెడ్డికి పంపేలా MIS విభాగంలో అనూష అనే ఆపరేటర్‌ను నియమించారు.

    సైఫ్ అనే వ్యక్తి లెక్కలు చేసి, కెసిరెడ్డికి పంపితే, ఆయన అవినాష్‌రెడ్డి, చాణక్యలకు ఫార్వర్డ్ చేసేవారు.

    ప్రతీ ఐదు రోజులకు డబ్బును వసూలు చేసి, డిపో మేనేజర్ల ద్వారా ఆర్డర్ అమలు జరిగేది.

    Details

    లక్షల్లో కేసులు, కోట్లలో ముడుపులు

    ప్రతి నెలా 27-30 లక్షల IML కేసులు, 7-10 లక్షల బీర్ కేసులు అమ్ముడయ్యేవి. ఒక్కో కేసుకు వసూలు చేసిన ముడుపులతో నెలకు రూ.50-60 కోట్ల మేర అక్రమ లాభాలు దండుకున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగింది.

    విచారణకు మిథున్‌రెడ్డిని కస్టడీకి

    ఈ కుట్రలో మిథున్‌రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని, ఆయన్ను కస్టడీలోకి తీసుకుని లాభం పొందిన ఇతరులను గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

    ఈ కేసు ద్వారా రాష్ట్రంలోని మద్యం వ్యవస్థ ఎలా లంచాల వేదికగా మారిందో స్పష్టమవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    వైసీపీ

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఆంధ్రప్రదేశ్

    AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్ భారతదేశం
    AP SSC Result 2025: పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్‌..   భారతదేశం
    Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీ మోడలింగ్.. 40కి పైగా రైళ్లు రద్దు తిరుపతి
    Andhra Pradesh: ఏపీకి భారీగా పెట్టుబడులు.. శ్రీసిటీలో ఎల్‌జీ మెగా ప్లాంట్! నెల్లూరు నగరం

    వైసీపీ

    Kapu Reservation: కాపుల రిజర్వేషన్‌ హామీని అమలు చేయండి.. సీఎం, డిప్యూటీ సీఎంలకు హరిరామ జోగయ్య లేఖ చంద్రబాబు నాయుడు
    Vijayasai Reddy: రాజకీయాలకు గుడ్‌బై.. రాజ్యసభకు విజయసాయి రెడ్డి రాజీనామా విజయసాయిరెడ్డి
    Sake Sailajanath: నేడు వైసీపీలోకి మాజీ మంత్రి శైలజానాథ్.. పార్టీలోకి ఆహ్వానించనున్న వైఎస్ జగన్  భారతదేశం
    Vizag: వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్‌.. రూ.44.74 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025