NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 
    'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి'

    Rahul Gandhi: 'రాజ్యాంగంపై దాడి చేయలేరని ఆర్‌ఎస్‌ఎస్‌కు అర్థమయ్యేలా చెప్పాలి': కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 06, 2025
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రూపొందించిన తాజా ముసాయిదా నిబంధనలను బీజేపీయేతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ పరిణామాల నేపథ్యంలో, డీఎంకే విద్యార్థి విభాగం గురువారం నాడు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగింది.

    ఈ నిరసన కార్యక్రమంలో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పాల్గొన్నారు.

    వివరాలు 

    యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాం: అఖిలేష్ 

    "ఈ యూజీసీ ముసాయిదా కేవలం విద్యాపరమైన చర్య మాత్రమే కాదు. ఇది మన దేశ చరిత్ర, సంప్రదాయాలు,సంస్కృతి,భాషలపై దాడి చేయడానికి ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నం.ఇదే విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నాను.దేశవ్యాప్తంగా ఒకే చరిత్ర,ఒకే సంప్రదాయం,ఒకే భాషను తేవాలనే ఆలోచనతోనే రాజ్యాంగంపై దాడి జరుగుతోంది.వివిధ రాష్ట్రాల విద్యా వ్యవస్థలను నియంత్రించేందుకు వారు చేస్తున్న ఈ ప్రయత్నం,వారి ఎజెండాను అమలు చేసేందుకు ఉద్దేశించినదే" అని రాహుల్ గాంధీ విమర్శించారు.

    యూజీసీ ముసాయిదా ప్రతిపాదనలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ తెలిపారు.

    ఈ కొత్త విధానం విశ్వవిద్యాలయాలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్రగా అభివర్ణిస్తూ, తాము దీనికి ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

    వివరాలు 

    కొత్త ముసాయిదా ప్రకారం ఈ అధికారం గవర్నర్ల చేతుల్లోకి..

    యూనివర్శిటీల్లో, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతుల కనీస అర్హతలు, అలాగే ఉన్నత విద్య ప్రమాణాలను నిర్వహించే మార్గదర్శకాలు-2025 పేరుతో యూజీసీ ఇటీవల ఓ ముసాయిదాను విడుదల చేసింది.

    అయితే, ఇందులోని అనేక ప్రతిపాదనలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

    ఇప్పటివరకు విశ్వవిద్యాలయాల అధిపతులైన వైస్ ఛాన్సలర్ల నియామక హక్కు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండేది.

    కానీ, కొత్త ముసాయిదా ప్రకారం ఈ అధికారం గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది.

    ఈ మార్పును భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

    తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    రాహుల్ గాంధీ

    Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ కాంగ్రెస్
    Haryana Results: హర్యానాలో గెలుపుపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్.. కలిసిరాని జాట్లు, జిలేబీ..  హర్యానా
    Rahul Gandhi: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన రాహుల్‌ గాంధీ భారతదేశం
    Rahul Gandi: బాబా సిద్దిఖీ హత్యపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు  కాంగ్రెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025