NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
    తదుపరి వార్తా కథనం
    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
    ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు

    Revanth Reddy: ఆర్టీసీ ప్రయాణం మరింత సౌకర్యవంతం.. త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 12, 2024
    09:32 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి రావడంతో బస్సుల్లో రద్దీ పెరిగి, మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో సీట్లు కొరత ఏర్పడింది.

    ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో కాలుష్య నియంత్రణను క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

    ఇందులో భాగంగా త్వరలోనే ఓఆర్‌ఆర్ పరిధిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. సోమవారం రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు.

    కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్‌పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టి కాలుష్యాన్ని తగ్గిస్తామన్నారు.

    Details

    50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    అదే విధంగా రవాణా సౌకర్యాలను కూడా మెరుగుపరుస్తామన్నారు. రేవంత్ రెడ్డి రవాణా శాఖ అధికారులను ప్రజలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్ సేవలను గౌరవప్రదంగా అందించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు.

    గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి పదినెలల్లో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు.

    ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించిన సందర్భంలో తల్లిదండ్రుల ఆనందం తనకు సంతోషం కలిగించిందని తెలిపారు.

    రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ లాంటి వాడకం నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు.

    Details

    1.05 లక్షల మంది మహిళలకు లబ్ధి

    అలాగే 10 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేసినట్టు వివరించారు.

    మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేయడం వల్ల 1.05 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని సీఎం తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రేవంత్ రెడ్డి
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రేవంత్ రెడ్డి

    Revanth Reddy: దిల్లీకి రేవంత్ రెడ్డి.. ఇవాళ మోదీ, అమిత్ షాతో భేటి తెలంగాణ
    Revanth Reddy: తెలంగాణ వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం రేవంత్‌ కేంద్రానికి విజ్ఞప్తి తెలంగాణ
    Revanth Reddy: వరదల నివారణకు శాశ్వత చర్యలు తీసుకోండి.. కేంద్ర బృందంతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం తెలంగాణ
    TPCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ తెలంగాణ

    తెలంగాణ

    Oil Palm Cultivation: రైతులకు బాగు.. ఆయిల్‌పామ్‌ సాగు.. నల్గొండలో ఆయిల్ ఫ్యాక్టరీ భారతదేశం
    IMD: బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ.. ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఐఎండీ
    Telangana: తెలంగాణలోని 9 యూనివర్సిటీలకు కొత్త వీసీల నియామకం భారతదేశం
    Railway Line: తెలంగాణలో పెండ్యాల్‌-హసన్‌పర్తి బైపాస్‌ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్‌ రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025