NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా
    తదుపరి వార్తా కథనం
    Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా
    అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

    Adani issue: అదానీ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షపార్టీలు.. ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    11:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి.

    అదానీ అంశంపై చర్చ చేపట్టాలని విపక్షపార్టీలు డిమాండ్‌ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో, ఉభయసభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి.

    లోక్‌సభ ప్రారంభం కాగానే అదానీ వివాదంపై చర్చ మొదలెట్టాలని విపక్షాలు అడిగాయి.

    కాంగ్రెస్‌ పార్టీ సహా ఇండియా కూటమి ఎంపీలు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో సభ గందరగోళంగా మారింది.

    ఈ పరిస్థితిని చూసి స్పీకర్‌ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.

    మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో, చైర్మన్‌ ధన్‌ఖర్‌ సభను మధ్యాహ్నం 11:30 గంటలకు వాయిదా వేశారు.

    వివరాలు 

    జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌

    ప్రసిద్ధ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదవడం, ఆ విషయాన్నిఅధికారికంగా విచారించిన న్యూయార్క్‌ ఫెడరల్‌ కోర్టులో అభియోగాలు నమోదు కావడం రాజకీయ,వ్యాపార రంగాల్లో తీవ్ర ఆసక్తిని కలిగించాయి.

    అదానీ గ్రూప్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు గెలుచుకోవడం కోసం వివిధ రాష్ట్రాల్లోని అధికారులను 265 మిలియన్‌ డాలర్లు(రూ. 2,238 కోట్లు)లంచంగా ఇవ్వడాన్ని సంబంధిత కోర్టు నిర్ధారించింది.

    ఈ అంశం ప్రస్తుతం రాజకీయ వర్గాల మధ్య తీవ్ర చర్చకు కారణమైంది.

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ అంశంపై లోక్‌సభలో చర్చ జరపాలని,జేపీసీ(జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది.

    కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్ కూడా అదానీ పై చర్చకు దరఖాస్తు చేశారు.దీంతో,సభలో గందరగోళం ఏర్పడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పార్లమెంట్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    పార్లమెంట్

    All-party meeting: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. కేంద్రం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం  తాజా వార్తలు
    PM Modi: ఎన్నికల్లో ఓటమిపై కోపం వద్దు: ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ సెటైర్ నరేంద్ర మోదీ
    డిసెంబర్ 13లోగా భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా: గురుపత్వంత్ సింగ్ బెదిరింపు గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర కేబినెట్ ఆమోదం.. వ్యభిచారం, స్వలింగ అంశాలపై మాత్రం..  కేంద్ర కేబినెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025