NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి 
    తదుపరి వార్తా కథనం
    Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి 
    ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు

    Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 04, 2024
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి పండుగ హంగామా మొదలైంది. హైదరాబాద్ మార్కెట్లలో వినాయక విగ్రహాల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి.

    పండుగ సమీపిస్తున్నందున ధూల్‌పేట నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాల సరఫరా జరుగుతోంది.

    ధూల్​పేటలో గణేశ్ విగ్రహాల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో ప్రజలు,గణేశ్​ఉత్సవ కమిటీల నిర్వాహకులు క్యూ కడుతున్నారు.

    ధూల్​పేటలో వీధులన్నీకొనుగోలుదారులతో నిండిపోయాయి. వినాయక చవితి సమీపిస్తుండడంతో గణేశ్ ఉత్సవ కమిటీల నిర్వాహకులు విగ్రహాలు కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు.

    ఇక్కడ 2 ఫీట్ల నుంచి 40 ఫీట్ల దాకా విభిన్న పరిమాణాలు, రూ.100 నుంచి రూ.5 లక్షల వరకు విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.

    వివరాలు 

    రకరకాల థీమ్‌లతో విగ్రహాలు

    ధూల్‌పేట్‌లో 3 నెలల క్రితమే వినాయక విగ్రహాల విక్రయాలు మొదలయ్యాయి. మార్కెట్‌లో ఈ సంవత్సరం రకరకాల థీమ్‌లతో విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి.

    రామ్‌లల్లా, శివాజీ గణేశ్, గరుడ గణేశ్, మహారాష్ట్ర ఫేమస్ గణేశ్ వంటి ప్రత్యేక ప్రతిమలు అందుబాటులో ఉన్నాయి.

    ధూల్‌పేటలో గణపతి విగ్రహాల తయారీకి మునుపటికంటే ఎక్కువగా కళాకారులను పిలిపించి తయారీని పూర్తి చేస్తున్నారు.

    ప్రభుత్వం మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది, కాని మార్కెట్‌లో వీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రజలు ఇంకా ఇతర ప్రతిమల వైపు మొగ్గు చూపుతున్నారు.

    వివరాలు 

    రెడీ అవుతున్న బాలాపూర్ ​గణనాథుడు 

    వ్యాపారుల ప్రకారం,ఇప్పటివరకు 70 శాతం విగ్రహాలు అమ్ముడుపోయాయి, చాలా మంది ఇప్పటికే అడ్వాన్స్‌ చెల్లించి బుక్‌ చేసుకున్నారు.

    గణేశ్ మండపాల్లో ప్రతిష్ఠించడానికి విగ్రహాలు కొనుగోలు చేసిన వెంటనే తరలింపు జరుగుతోంది.

    బాలాపూర్ గణేశుడి నమూనాలను కోరుకునేవారూ ఉన్నారు.ఈ థీమ్ విగ్రహాలు 7 నుంచి 10 అడుగుల ఎత్తులో ఉంటున్నాయి, వీటిని రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు అమ్ముతున్నారు.

    తెలంగాణలో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత, బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాట ప్రసిద్ధి చెందింది.

    ప్రతీ ఏటా ఏర్పాటు చేసే విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి, అందువల్ల, బాలాపూర్ తరహా విగ్రహాలు కావాలని చాలా మంది పట్టుబడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    #NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..? అంతరిక్షం

    హైదరాబాద్

    Madhavi Latha: హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు.. వీడియో వైరల్..!  భారతదేశం
    Hyderabad: బేగంపేట ఫ్లై ఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు  భారతదేశం
    Attack on Couple: హైదరాబాద్‌లో పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ.. ముగ్గురికి గాయలు  భారతదేశం
    Heavy Rain:హైదరాబాద్ లో భారీ వర్షం .. అరగంటలో 5 సెంటిమీటర్ల వాన  భారీ వర్షాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025