NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 
    భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి

    Saudi Arabia:భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల వేళ.. హఠాత్తుగా న్యూదిల్లీకి సౌదీ విదేశాంగ మంత్రి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 08, 2025
    01:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో, సౌదీ అరేబియా నుంచి ఒక జూనియర్‌ మంత్రి అకస్మాత్తుగా న్యూఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు.

    సౌదీ విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌ ఈ రోజు భారత రాజధాని దిల్లీకి వచ్చారు.

    ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌తో సమావేశమై ద్వైపాక్షికంగా చర్చలు నిర్వహించారు.

    ఈ పర్యటన,భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా జరిగినట్టు సమాచారం.

    ఈ భేటీ అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎక్స్‌ వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు.

    ''సౌదీ మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌తో మంచి సమావేశం జరిగింది.ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత్‌ తీసుకుంటున్న కఠినమైన వైఖరిని ఆయనకు వివరించాను,''అని పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఎస్‌. జైశంకర్‌ చేసిన ట్వీట్ 

    A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning.

    Shared India’s perspectives on firmly countering terrorism.

    🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025

    వివరాలు 

    సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో కూడా భేటీ 

    ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో భారత్‌-పాక్‌ సంబంధాలు యుద్ధ వాతావరణాన్ని తారాస్థాయికి చేరాయి.

    ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలను శాంతిపరంగా పరిష్కరించేందుకు సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా, సౌదీ మంత్రి పర్యటన ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.

    ఇదిలా ఉండగా,భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ వ్యవహారాల ఉపమంత్రిగా ఉన్న సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితో కూడా సమావేశమయ్యారు.

    ఇరాన్‌ ఇప్పటికే భారత్‌, పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది.

    వివరాలు 

    అధికారిక ప్రకటన లేకుండానే పాకిస్థాన్‌ వెళ్లిన అరాగ్ఛి

    ఇటీవల అరాగ్ఛి తన సోషల్‌ మీడియా ఖాతాలో, ''మనకు సోదరులాంటి పొరుగుదేశాలు అత్యంత ప్రాధాన్యం కలిగినవే'' అంటూ వ్యాఖ్యానించారు.

    అంతేకాక, భారత్‌,పాక్‌లో ఉన్న తమ రాయబార కార్యాలయాల సహకారంతో, ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

    గమనించదగిన విషయం ఏంటంటే, అరాగ్ఛి పాకిస్థాన్‌ను ఎటువంటి అధికారిక ప్రకటన లేకుండానే రహస్యంగా సందర్శించారు.

    అక్కడి నాయకులతో చర్చలు జరిపి, అనంతరం తిరిగి ఇరాన్‌కు వెళ్లి తర్వాత న్యూఢిల్లీకి వచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    GT vs LSG: గుజరాత్ టైటాన్స్‌పై లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ 33 పరుగుల తేడాతో విజయం ఐపీఎల్
    RCB: ఆర్సీబీ జట్టులో అనుకోని మార్పు.. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ ప్లేఆఫ్స్‌కు దూరం  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ఉగ్రవాదులతో ఎన్‌కౌంటర్‌.. జవాన్ వీరమరణం  జమ్ముకశ్మీర్
    All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌

    సుబ్రమణ్యం జైశంకర్

    సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు 'ఆపరేషన్ కావేరి' ప్రారంభం  భారతదేశం
    ఆపరేషన్ 'కావేరి': సూడాన్ నుంచి 1100మంది భారతీయులు తరలింపు సూడాన్
    కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్ కెనడా
    నిజ్జర్ హత్య గురించి నన్ను అడగడం సరికాదు: జైశంకర్ ఆసక్తికర  వ్యాఖ్యలు  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025