Loading...
Supreme Court: రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 
రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే

Supreme Court: రిజర్వేషన్ల కోసం హిందువునంటే.. రాజ్యాంగాన్ని మోసం చేయడమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2024
08:24 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పులో వేరే మతాలను అనుసరిస్తూ, కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం తమను హిందువులుగా ప్రకటించుకునే ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఈ చర్యను మోసం చేయడమేనని వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతాన్ని అనుసరించే మహిళకు షెడ్యూల్డ్ కుల ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరిస్తూ మద్రాసు హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

వివరాలు 

తీర్పు వివరణ 

జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఆర్. మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం 21 పేజీల తీర్పులో ఈ వ్యవహారాన్ని విశ్లేషించింది.

"మత మార్పిడి కోసం ఏకైక ఉద్దేశం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసమైతే, అది రిజర్వేషన్ల ఆత్మను దెబ్బతీసే చర్య అవుతుంది," అని పేర్కొంది.

ఒక మతం నుండి మరొక మతంలోకి మారాలనుకునేవారు ఆ మత సిద్ధాంతాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను పూర్తిగా విశ్వసించాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది.

వివరాలు 

కేసు నేపథ్యం

క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ చర్చికి వెళుతున్నట్లు మహిళ సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా ధర్మాసనం ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు నిర్ధారించింది.

అయినప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగం కోసం తాను హిందువునని ప్రకటించడాన్ని ధర్మాసనం దుయ్యబట్టింది.

ఆమె తన హిందూ మత ప్రవేశానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని తీర్పులో ప్రస్తావన ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

కీలక అంశాలు 

మహిళ తన తండ్రి హిందూ ఎస్సీ వర్గానికి చెందినదని పేర్కొన్నప్పటికీ, తాను మత మార్పిడి ద్వారా హిందువుగా మారినట్లు ఎలాంటి సాక్ష్యాలు చూపలేదు.

ఆమె వంశీయుల అంగీకారాన్ని పొందినట్లు కూడా ఆధారాలు లేవు.

ఈ క్రమంలో ఉద్యోగ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం ఇచ్చి షెడ్యూల్డ్ కుల ధ్రువపత్రం కోరడం రాజ్యాంగ పరిరక్షణలను దుర్వినియోగం చేయడమే అని ధర్మాసనం తేల్చింది.

ADVERTISEMENT

వివరాలు 

పిటిషనర్ నేపథ్యం 

సెల్వరాణి అనే పిటిషనర్ హిందూ తండ్రికి, క్రైస్తవ తల్లికి జన్మించారు. మూడు నెలల వయసులో బాప్టిజం పొందారు.

2015లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎస్సీ ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక యంత్రాంగం ఆమె దరఖాస్తును తిరస్కరించగా, ఆమె మద్రాసు హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టులో అనుకూల తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తీర్పు ప్రాముఖ్యత

ఈ తీర్పు మతం మార్పు, రిజర్వేషన్ల వినియోగంపై కీలక మార్గదర్శకాలను అందించింది.

రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం మత పరమైన అనుసరణలను తప్పుడు ఉపయోగం చేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని ఈ తీర్పు స్పష్టంగా తెలిపింది.

ADVERTISEMENT