NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Eknath Shinde: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్‌నాథ్ షిండే 
    తదుపరి వార్తా కథనం
    Eknath Shinde: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్‌నాథ్ షిండే 
    మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్‌నాథ్ షిండే

    Eknath Shinde: మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మోదీ నిర్ణయమే ఫైనల్: ఏక్‌నాథ్ షిండే 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 27, 2024
    04:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో సీఎం పదవిపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ, రాష్ట్రపు అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఆయన తనకు ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి నిర్ణయమైనా ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

    బుధవారం థానేలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

    "పోరాటం నా రక్తంలో ఉంది,"అని ఏక్‌నాథ్‌ చెప్పారు.మహాయుతి గెలుపు కోసం ఆయన పలు సంవత్సరాల పాటు కార్యకర్తగా పనిచేసినట్లు పేర్కొన్నారు.

    "నేను ఒక కార్యకర్తగా పని చేసి ఒక కార్యకర్తలా చెప్పులు అరిగేలా తిరిగానని పేర్కొన్నారు"అని తెలిపారు.

    వివరాలు 

    ముఖ్యమంత్రి అంటే ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తి,

    పార్టీకి వచ్చిన విజయం గురించి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు మహావికాస్‌ అఘాడీ కూటమిని తిరస్కరించిన విషయం మీద శింధే వ్యాఖ్యానించారు.

    "మా దృష్టిలో ముఖ్యమంత్రి అంటే ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వ్యక్తి," అని ఆయన చెప్పారు.

    తాను ఎప్పటికీ అధికారికంగా ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదని, ఒక సాధారణ వ్యక్తిగా ప్రజల మధ్య తిరిగానని చెప్పారు. ఆయన ఒక రైతు కుటుంబం నుండి వచ్చారని, పేదల కష్టాలను బాగా అర్థం చేసుకునే వ్యక్తిగా ఉన్నారని వెల్లడించారు. "జీవితంలో ఎన్నో అడ్డంకులు చూశాను," అని ఆయన తెలిపారు.

    మహారాష్ట్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, బాల్‌ థాక్రే ఆశయాలను కొనసాగించగలిగే విధంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

    వివరాలు 

    ముఖ్యమంత్రిని  బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించాలి

    ఆయనకు ప్రధాని మోదీ నుండి పూర్తిగా మద్దతు ఉందని అన్నారు.

    "ప్రమోషన్ల కోసం అనవసరంగా వార్తల్లో ఉండాలని నాకు అభిరుచి లేదు," అని స్పష్టం చేశారు.

    తన సహచర మంత్రులతో కలిసి తాను 24/7 పనిచేశామని, ఇకపై ముఖ్యమంత్రిగా ఎవరు నియమించబడతారో బీజేపీ హైకమాండ్‌నే నిర్ణయించాల్సి ఉందని చెప్పారు.

    "ముఖ్యమంత్రి పదవిపై మోదీ,అమిత్‌ షా వారు తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, ఎవరైనా నిర్ణయం తీసుకున్నా, నేను అది అంగీకరించి, వారికోసం పనిచేస్తానని" అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఏక్‌నాథ్ షిండే

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఏక్‌నాథ్ షిండే

    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర
    'శివసేన' పార్టీ గుర్తుకోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఉద్ధవ్ ఠాక్రే- రేపు విచారణ శివసేన
    మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై పరువు నష్టం కేసు; హత్యాయత్నం ఆరోపణలపై రాజకీయ దుమారం శివసేన
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025