NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే  
    తదుపరి వార్తా కథనం
    Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే  
    ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

    Isha Foundation: ఈశా ఫౌండేషన్‌ విషయంలో మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 03, 2024
    01:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈశా ఫౌండేషన్ (Isha Foundation) ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    తమిళనాడు పోలీసుల నుంచి ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, ఫౌండేషన్ ఈ కేసు విషయంలో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

    ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశించింది. అదేవిధంగా, పోలీసుల నుంచి స్టేటస్ రిపోర్టును సమర్పించాలని కోరింది.

    ఈ కేసు నేపథ్యంలో ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు బదిలీ చేశారు.

    వివరాలు 

    మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు

    కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగా కేంద్రంలో తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలంటూ కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

    తన కుమార్తెలు గీత, లత యోగా నేర్చుకోవడానికి ఈశా కేంద్రానికి వెళ్లి, అక్కడే ఉండిపోయారని కామరాజ్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

    మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపి, కోయంబత్తూరు న్యాయమూర్తికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

    పిటిషనర్ అభ్యర్థనలో, తన కుమార్తెలు ఈశా యోగా కేంద్రంలో నిర్బంధించబడి చిత్రహింసలు అనుభవిస్తున్నట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు.

    వివరాలు 

    జగ్గీ వాసుదేవ్ కుమార్తెకు వివాహం.. ఇతరుల పిల్లలను సన్యాసులను  చేయడంపై ప్రశ్నలు 

    తాను ఫౌండేషన్‌పై ఏవైనా ఆందోళనలు చేపడితే, తన రెండో కుమార్తె చనిపోయేవరకు నిరాహారదీక్ష చేపడతానని హెచ్చరించిందన్నారు.

    తన కుమార్తెలు బయటకు వస్తే, వారిని ఇబ్బందిపెట్టకుండా వారి ఏకాంతాన్ని కాపాడుతానని పిటిషనర్ తెలిపారు.

    విచారణలో భాగంగా, న్యాయమూర్తులు జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసిన ఫోటోను పరిశీలించి, ఇతరుల పిల్లలను సన్యాసులను చేయడంపై ప్రశ్నించారు.

    ఈ నేపథ్యంలో, ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో, పెళ్లి చేసుకోమని లేదా సన్యాసం కావాలని ఎవ్వరినీ కోరడం లేదని స్పష్టం చేసింది.

    ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ, సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    సుప్రీంకోర్టు

    Neet Row: నీట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశం.. రీ-ఎగ్జామ్ ఉండదు.. పేపర్ లీకేజీకి తగిన ఆధారాలు లేవు నీట్ స్కామ్ 2024
    Bihar: బీహార్ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ  బిహార్
    Supreme Court: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు భారతదేశం
    Bela Trivedi: ఎస్సీ వర్గీకరణను జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించడానికి కారణమిదే ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025