NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం 
    తదుపరి వార్తా కథనం
    Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం 
    ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం

    Godra Case: ఫిబ్రవరి 13న గోద్రా కేసు విచారణ.. సుప్రీంకోర్టు నిర్ణయం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 16, 2025
    05:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2002లో గోద్రా రైలు ఘటనపై విచారణను ఫిబ్రవరి 13న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

    గుజరాత్ ప్రభుత్వం సహా అనేక మంది దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ జరపనుంది.

    ఈ కేసు విచారణకు మరో తేదీ ఇవ్వబోమని జస్టిస్ జేకే మహేశ్వరి, అరవింద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

    2002 ఫిబ్రవరి 27న సబర్మతి రైలులోని ఎస్-6 బోగీలో చెలరేగిన మంటల వల్ల సుమారు 59 మంది ప్రయాణికులు మరణించారు.

    ఈ కేసులో 2017లో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అనేక మంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు.

    వివరాలు 

    కేసు ఐదు సార్లు వాయిదా

    జీవిత ఖైదు శిక్ష పొందిన 11 మంది నిందితులకు మరణశిక్ష విధించాలంటూ గుజరాత్ ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

    గురువారం విచారణ సమయంలో ఓ నిందితుడి తరఫున లాయర్ హాజరైనప్పటికీ ఆధారాలు సమర్పించలేకపోయారు.

    గత ఏడాది నుంచి కేసును ఐదు సార్లు వాయిదా వేశామని, ఇక మరలా వాయిదా వేయబోమని జస్టిస్ మహేశ్వరి తెలిపారు.

    కొందరు నిందితుల క్షమాభిక్ష పిటీషన్లు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయని లాయర్ కోర్టుకు తెలియజేశారు.

    గుజరాత్ ప్రభుత్వ అప్పీల్‌పై ముందు విచారణ జరపాలని సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    సుప్రీంకోర్టు

    Supreme Court: 'పంట వ్యర్థాలు తగలబెట్టడం' సమస్యపై కఠిన చట్టాలు.. కేంద్రంపై సుప్రీం అసహనం కేంద్ర ప్రభుత్వం
    VK Saxena: చెట్ల నరికివేతకు న్యాయస్థానం అనుమతి తీసుకోవాలనే విషయం.. నాకు తెలీదు: సుప్రీంకోర్టుకు ఎల్జీ సమాధానం దిల్లీ
    Supreme Court: యూపీ మదర్సా ఎడ్యుకేషన్‌ చట్టం రాజ్యాంగబద్ధమే: సుప్రీంకోర్టు   ఉత్తర్‌ప్రదేశ్
    Supreme Court: ప్రైవేట్‌ ఆస్తుల స్వాధీనం కుదరదు.. తేల్చిచెప్పిన సుప్రీం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025