NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 
    తదుపరి వార్తా కథనం
    Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 
    పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు

    Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 16, 2025
    12:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విషప్రయోగం కలకలం రేపింది. పాఠశాల తాగునీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది.

    అంతే కాకుండా మధ్యాహ్న భోజనం (ఎంఐడ్డీ మిల్) వంటకు ఉపయోగించే సామగ్రిపై కూడా అదే మందును చల్లినట్లు అధికారులు తెలిపారు.

    శనివారం, ఆదివారం సెలవుల నేపథ్యంలో పాఠశాల సిబ్బంది వంట గదికి తాళం వేసి వెళ్లారు.

    సోమవారం ఉదయం వంట ఏర్పాట్ల కోసం పాత్రలు కడుగుతుండగా వాటి నుంచి దుర్వాసన రావడంతో పాటు నురగలు కూడా ఏర్పడ్డాయి. దీంతో వారు అనుమానం చెందారు.

    ఆ వెంటనే చుట్టూ గమనించగా పురుగుల మందు డబ్బా ఒకటి కనిపించింది.

    Details

    పోలీసులకు ఫిర్యాదు చేసిన హెడ్ మాస్టర్

    తాగునీటి ట్యాంకును పరిశీలించగా అందులోనూ అదే మందు కలిపినట్లు గుర్తించారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యార్థులను తాగునీటి కుళాయిలకు వెళ్లకుండా ఆపారు.

    మధ్యాహ్న భోజనాన్ని వండకుండా ముందస్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల పాఠశాలలో ఉన్న దాదాపు 30 మంది విద్యార్థులు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

    పాఠశాల హెడ్‌మాస్టర్ ప్రతిభ ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది. స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిలాబాద్
    తెలంగాణ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఆదిలాబాద్

    మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  తెలంగాణ
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   అమిత్ షా
    PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన  నరేంద్ర మోదీ
    PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ

    తెలంగాణ

    Supreme court: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు.. తీర్పు రిజర్వు బీఆర్ఎస్
    Heavy rains: తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌! భారీ వర్షాలు
    Bomb threat: మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు భారతదేశం
    Inter : తెలంగాణ ఇంటర్ బోర్డు 2025-26 అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025