Gujarat: వడోదరలో ఘోర పడవ ప్రమాదం.. 14 మంది విద్యార్థులు మృతి
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 18, 2024
07:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని వడోదరలోని హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో పద్నాలుగు మంది విద్యార్థులు మృతి చెందారు. పడవలో ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించలేదని సమాచారం. ఘటన అనంతరం అగ్నిమాపక సిబ్బంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి