NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు
    అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు

    Ayodhya: అయోధ్యలో మరోసారి ప్రాణప్రతిష్ఠ.. రామ దర్బార్‌తోపాటు మరిన్ని దేవాలయాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    02:45 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం మళ్లీ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోతోంది.

    గత ఏడాది బాలరాముని విగ్రహానికి విజయవంతంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన తరువాత, ఇప్పుడు మరోసారి ఆలయంలో పునఃప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు జరుగుతున్నాయి.

    ప్రస్తుతం ఆలయ మొదటి అంతస్తులో రామ దర్బార్ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠతో పాటు, ఇతర దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

    ఈ మహత్కార్యానికి మంగళవారం ఉదయం 6:30 గంటలకు శ్రీకారం చుట్టగా, జూన్ 5వ తేదీ వరకు కొనసాగనుంది.

    ఈ పుణ్యకార్యాల్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారని తెలుస్తోంది.

    వివరాలు 

    సరియు జయంతి వేడుకలకు రంగం సిద్ధం 

    రామదర్బార్ ఉత్సవాలకుతో పాటు జూన్ 5వ తేదీన అయోధ్యలో సరియు జయంతి జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.

    ఈవేడుకలను సీఎం యోగి ఆదిత్యనాథ్ జ్యోతిని వెలిగించి ప్రారంభిస్తారని శ్రీరామ్ వల్లభ్ కుంజ్ అధిపతి మహంత్ రాజ్‌కుమార్ దాస్ మహారాజ్ వెల్లడించారు.

    అదే రోజు జరిగే రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకానున్నారు.

    జూన్ 5వ తేదీ నుంచి 11వతేదీ వరకు అయోధ్యరామాలయంలో వారంరోజుల పాటు సరియు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

    ఈకార్యక్రమాలను ఆంజనేయ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

    ఇందులో భక్తుల్ని ఆకట్టుకునేలా భక్తి సంగీతం,ప్రత్యేక పూజలు,ఆధ్యాత్మిక ఉపన్యాసాలు నిర్వహించబోతున్నారు.

    జూన్ 11న పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హారతితో ఈ వేడుకలకు ముగింపు పలుకుతారని మహంత్ రాజ్‌కుమార్ దాస్ తెలిపారు.

    వివరాలు 

    ముఖ్యమంత్రి హాజరుతో ఉత్సవాలకు విశిష్టత 

    ఆంజనేయ సేవా సమితి అధ్యక్షుడు మహంత్ శశికాంత్ దాస్ మాట్లాడుతూ.. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొనడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.

    రామ భక్తులందరూ ఈ పుణ్య కార్యంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    అయోధ్య అభివృద్ధి యోగి నేతృత్వంలో వేగంగా జరుగుతోందని పేర్కొన్న ఆయన, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నుంచి కీలక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    వివరాలు 

    ఆధ్యాత్మికతను ముందుకు తీసుకెళ్లే చర్యలు 

    ఇక మరోవైపు అయోధ్యలో మానసికశాంతి, ఆధ్యాత్మికతను మరింత బలపరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

    రామ్‌పథ్, ధర్మ 14 కోసి మార్గ్ వంటి ముఖ్య మతపరమైన ప్రాంతాల్లో మాంసం అమ్మకాలను నిషేధించే ప్రక్రియ మొదలైంది.

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జనతా దర్బార్‌లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి, సంబంధిత దుకాణదారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది.

    అయోధ్య మేయర్ గిరీష్ పతి త్రిపాఠి మాట్లాడుతూ, మద్యం నిషేధం కూడా ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా ఉందని, ఈ విషయంలో గణనీయంగా చర్చలు సాగుతున్నాయని వెల్లడించారు.

    అయోధ్యను సంపూర్ణ పవిత్ర ధార్మిక కేంద్రముగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అయోధ్యకి వస్తున్న భక్తులు 

    #WATCH | Uttar Pradesh | Rituals of 'pran pratishtha' of Ram Darbar on first floor of Shri Ram Janmabhoomi Temple begin in Ayodhya. pic.twitter.com/NAjuZYwx5Z

    — ANI (@ANI) June 3, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అయోధ్య

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    అయోధ్య

    Sri Ram puja: అయోధ్య రామాలయం ప్రారంభోత్స వేళ.. మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ విధానంలో పూజించండి శ్రీరాముడు
    Ram Mandir History: 75 సంవత్సరాల అయోధ్య రామమందిర చరిత్ర భారతదేశం
    Ram mandir inauguration: పులకించిన భక్తజనం.. అయోధ్య రామాలయంలో వైభవంగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ   అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    అయోధ్య రామాలయ ప్రత్యేకతలు.. స్టీల్ వాడకుండా.. భూకంపాలు వచ్చినా తట్టుకునేలా నిర్మాణం  అయోధ్య రామాలయ ప్రారంభోత్సం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025