NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ
    తదుపరి వార్తా కథనం
    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ
    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ

    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2023
    09:27 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న 2000 బ్యాచ్ ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి వీకే పాండియన్ సర్వీసు నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు.

    కేంద్రం అతని స్వచ్ఛంద పదవీ విరమణను సోమవారం ఆమోదించింది. పాండియన్ రాజకీయాల్లోకి ప్రవేశించడానికి మార్గం సుగమం చేసింది.

    పాండియన్ రాజకీయ రంగ ప్రవేశంపై ఒడిశా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

    నవీన్ పట్నాయక్ 'మ్యాన్ ఫ్రైడే'గా పరిగణించబడుతున్న పాండియన్ ముఖ్యమంత్రి తరపున రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

    2011 నుండి తన ప్రస్తుత పదవిలో ఉన్న పాండియన్, ఒడిశా అధికార కారిడార్‌లలో చక్రం తిప్పుతున్నారు.

    ఇటీవల రాష్ట్ర ఛాపర్‌ని ఉపయోగించి వివిధ జిల్లాలకు సుడిగాలి పర్యటన చేసి వెలుగులోకి వచ్చారు.

    Details 

     పాండియన్ పై  బిజెపి, కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు 

    సర్వీస్ కండిషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడుకు చెందిన పాండియన్‌ను ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్నాయి.

    పాండియన్ రాజకీయ ప్రవేశం గురించి వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలక, వచ్చే ఎన్నికలలోపు ఒడిశా ముఖ్యమంత్రిగా పాండియన్ బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అన్నారు.

    ఒడిశాలో అధికార యంత్రాంగం అలాంటిది, ఏం జరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. కానీ ఈ విషయమై ఎవరిని ఎవరు నియంత్రిస్తున్నారో మాత్రం అందరికీ తెలుసు. సెలవులో ఉన్న 3 రోజుల్లో VRS ఆమోదించబడింది, సూపర్ ఫాస్ట్.. అంటూ అయన తన X లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నాడు.

    పాండియన్ స్వచ్ఛంద పదవీ విరమణ నిర్ణయాన్ని మరో కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే ఎస్ఎస్ సలుజా స్వాగతించారు. ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

    Details 

    బ్యూరోక్రాట్ లా కాకుండా ఇప్పుడు బహిరంగంగా రాజకీయాలు చేస్తాడు: మోహన్ మాఝీ

    తన రాజకీయ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లేందుకే పాండియన్ రాజీనామా చేసినట్లు బీజేపీ చీఫ్ విప్ మోహన్ మాఝీ తెలిపారు.

    ఇప్పుడు, అతను బ్యూరోక్రాట్ లా కాకుండా బహిరంగంగా రాజకీయాలు చేయగలడని ఆయన అన్నారు. ఒడిశా ప్రజలు అతన్ని అంగీకరించరని ఆయన పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    నవీన్ పట్నాయక్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఒడిశా

    బిహార్, ఒడిశాలో మరికొన్ని ప్రాంతాల్లో ఎయిర్‌టెల్ 5జీ సేవలు ప్రారంభం బిహార్
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు
    యూకేలో భారతీయం; సంబల్‌పురి చీరను ధరించి మారథాన్‌లో నడిచిన ఒడిశా మహిళ  బ్రిటన్
    లండన్‌లో జగన్నాథ ఆలయ నిర్మాణం; ప్రవాస ఒడిశా వ్యాపారి 25మిలియన్ పౌండ్ల విరాళం పూరీ జగన్నాథ దేవాలయం

    నవీన్ పట్నాయక్

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన  ఒడిశా
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025