NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి

    వ్రాసిన వారు Stalin
    Apr 07, 2023
    05:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐటీ సిటీ హైదరాబాద్‌ను వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమలను కలిపే సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఈ సెమీ-హై స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.

    ఈ క్రమంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ శుక్రవారం ట్వీట్ చేశారు. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ గర్వం, సౌకర్యం, కనెక్టివిటీకి పర్యాయపదమని వ్యాఖ్యానించారు.

    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తే తెలుగు రాష్ట్రాలకు ఇది రెండో ట్రైన్ అవుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సేవలను అందిస్తోంది.

    వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్

    టిక్కెట్ ధరలు రూ. 1150తో ప్రారంభం

    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. ఇది 8 గంటల 30 నిమిషాల్లో 660.77 కిలోమీటర్ల దూరాన్ని చేరుకుంటుంది.

    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం మినహా మిగతా రోజుల్లో నడుస్తుంది.

    ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో మాత్రమే ఆగుతుంది.

    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టిక్కెట్ ధర రూ. 1150 (జీఎస్టీ, తత్కాల్ సర్‌చార్జితో కలిపి)తో ప్రారంభమవుతుంది. అయితే వాస్తవమైన ఛార్జీలను వివరంగా రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు.

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్

    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్

    సికింద్రాబాద్ - తిరుపతి (20701)

    సికింద్రాబాద్ - ఉదయం 6గంటలకు ప్రారంభం

    నల్గొండ - ఉదయం 07.19

    గుంటూరు - 09.45 గంటలు

    ఒంగోలు - 11.09 గంటలు

    నెల్లూరు - 12.29 గంటలు

    తిరుపతి - మధ్యాహ్నం 14.30గంటలు

    తిరుపతి - సికింద్రాబాద్ (20702)

    తిరుపతి - మధ్యాహ్నం 15.15 గంటలకు ప్రారంభం

    నెల్లూరు - రాత్రి 17.20 గంటలు

    ఒంగోలు - రాత్రి 18.30 గంటలు

    గుంటూరు - రాత్రి 19.45 గంటలు

    నల్గొండ - రాత్రి 22.10 గంటలు

    సికింద్రాబాద్ - రాత్రి 23.45 గంటలు

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్
    తిరుపతి
    తెలంగాణ

    తాజా

    Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ..  రానా దగ్గుబాటి
    OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ  ఓపెన్ఏఐ
    PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. నరేంద్ర మోదీ
    Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌  బీఎస్‌ఎఫ్‌

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ హైదరాబాద్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ

    తెలంగాణ

    మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత; సీఎం కేసీఆర్ సంతాపం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    మహిళా రిజర్వేషన్ బిల్లు: రేపు కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కల్వకుంట్ల కవిత
    మార్చి 26న మహారాష్ట్రలో బీఆర్ఎస్ బహిరంగ సభ; సీఎం కేసీఆర్ హాజరు భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ రైలు కారిడార్; 4గంటల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు! రైల్వే శాఖ మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025