NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
    తదుపరి వార్తా కథనం
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి!

    వ్రాసిన వారు Stalin
    Mar 25, 2023
    11:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌ను భారతీయ రైల్వే చాలా వేగంగా విస్తరిస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసును నడిపేందుకు సిద్ధమవుతోంది.

    ఏప్రిల్ 8న తేదీన సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

    ఈ రైలు కోసం సికింద్రాబాద్ నుంచి మిర్యాలగూడ- బీబీ నగర్-నడికుడి- గుంటూరు మీదుగా తిరుపతి వెళ్లే మార్గాన్ని అధికారులు ఎంచుకున్నారు.

    బీబీ నగర్-నడికుడి మార్గం గుండా వెళితే ప్రయాణ సమయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ రైల్వే ట్రాక్‌ను 130కిలో మీటర్ వేగంతో ప్రయాణించేలా అప్ గ్రేడ్ కూడా చేశారు.

    ప్రస్తుతం సికింద్రాబాద్‌-తిరుపతికి వేలాది మంది భక్తులు వెళుతుంటారు. ఈ క్రమంలో రద్దీని తగ్గించడానికి ఈ సర్వీసు దోహదపడుతుందని భారతీ రైల్వే భావిస్తోంది.

    వందేభారత్

    6 నుంచి 7గంటల్లోనే సికింద్రాబాద్-తిరుపతికి చేరుకోవచ్చు

    ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించడానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును రూపొందించినట్లు భారతీయ రైల్వే చెబుతోంది.

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ట్రాక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. ఈ గణనీయమైన వేగాన్ని పెంచడం వల్ల సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణ సమయం చాలా తగ్గుతుంది.

    ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో 12 గంటల్లో ప్రయాణిస్తుంది. అయితే వందే భారత్ రైలు 6 నుంచి 7 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.

    రైలు ఆగే స్టేషన్లపై ఇంకా క్లారిటీ రాలేదు. బహుశా గుంటూరు, నెల్లూరు స్టేషన్లలో రైలు ఆగోచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

    వందేభారత్ ఎక్స్‌ప్రెస్

    వందేభారత్ రైలు టిక్కెట్ ధర ఒక్కరికి రూ. 1150

    సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు టిక్కెట్ ధర ఒక్కరికి రూ. 1150గా నిర్ణయించారు. అయితే ఇతర రైలు టికెట్లతో దీన్ని పోల్చకోవద్దని అధికారులు సూచించారు.

    రైలులో ఆహారం, టిఫిన్ వంటి కొన్ని సౌక్యర్యాలను బట్టి టికెట్ ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

    అన్నింటికి మించి మిగతా రైళ్లతో పోల్చితే చాలా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు.

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశం అంతటా రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తోంది. వందేభారత్ కోసం చెన్నై-కోయంబత్తూరు, జైపూర్-దిల్లీ రైల్వే మార్గాలను అభివృద్ధి చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్
    తిరుపతి
    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ హైదరాబాద్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ

    దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    గుత్తి-ధర్మవరం రైల్వే ప్రాజెక్టు డబ్లింగ్, విద్యుద్ధీకరణ పనులు పూర్తి- భారీగా పెరగనున్న రైళ్ల రాకపోకలు అనంతపురం అర్బన్
    కర్నాటక: హుబ్లీ రైల్వే స్టేషన్‌‌కు గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో చోటు కర్ణాటక
    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025