NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 
    తదుపరి వార్తా కథనం
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ

    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ 

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2023
    11:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ రైల్వే నడుపుతున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.

    కొన్ని రూట్లలో టిక్కెట్లు దొరకడం కూడా కష్టంగా మారుతోంది. అందులో ప్రధానంగా సికింద్రాబాద్-తిరుపతి రైలుకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

    సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం 8బోగీలు మాత్రమే ఉన్నాయి. దీంతో అనేక మంది ప్రయాణికులకు రిజర్వేషన్లు లభించడం లేదు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో వెయిటింగ్ లిస్ట్ 10 రోజులు చూపిస్తోంది.

    ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలులో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకున్నారు.

    16 కోచ్‌లతో రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను ఆయన ఆదేశించినట్లు సమాచారం.

    వందేభారత్

    త్వరలో బోగీల సంఖ్య రెట్టింపు 

    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో 16 కోచ్ లతో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది.

    అంటే ప్రస్తుతం ఉన్న బోగీల సంఖ్య రెట్టింపు కానుంది. అయితే అదనపు బోగీలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చూడాలి. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు మంగళవారం మినహా 6 రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

    తిరుమల వెళ్లే భక్తులకు ఈ సెమీ హైస్పీడ్ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.

    తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్
    తిరుపతి
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తిరుపతి

    ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ను ప్రారంభించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి
    TSRTC: 'బాలాజీ దర్శనం' ప్యాకేజీకి విశేష స్పందన; తిరుమలకు 1.14 లక్షల మంది భక్తులు తెలంగాణ
    రేపు సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; ట్రైన్ రూట్, టికెట్ ధరలను తెలుసుకోండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ

    తాజా వార్తలు

    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా  సుప్రీంకోర్టు
    బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్ కర్ణాటక
    'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025