NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 
    ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ

    Semicon 2024: ఇండియన్ మేడ్ చిప్ మా కల.. సెమికాన్ 2024 కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 11, 2024
    03:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించిన దాని ప్రకారం,ప్రపంచవ్యాప్తంగా ప్రతి పరికరంలో ఇండియా తయారు చేసిన చిప్ ఉండాలనేది ఆయన కల.

    భారత్‌లో ఎప్పటికీ చిప్‌ల కొరత ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.

    దిల్లీలో జరిగిన'సెమికాన్ 2024 కాన్ఫరెన్స్'లో మోదీ సెమికండక్టర్ పరిశ్రమకు చెందిన కంపెనీల ప్రతినిధులు,నిపుణులతో ప్రసంగించారు.ఈసందర్భంలో వారు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని మోదీ కోరారు.

    ''ప్రతి పరికరంలో భారతీయ చిప్ ఉండాలని మా కల.భారత్‌ను సెమికండక్టర్ పరిశ్రమలో శక్తివంతమైన కేంద్రంగా మార్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం.ప్రస్తుతం భారతదేశానికి త్రీ డైమెన్షనల్ పవర్ ఉంది.ఆ మూడు సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం, తయారీకి అనుకూల వాతావరణం,ఆశాజనకమైన మార్కెట్. ఇలాంటి టెక్నాలజీ రుచి ఉన్న మార్కెట్ మరోచోట దొరకడం అసాధ్యం''అని మోదీ తెలిపారు.

    వివరాలు 

    భారత చిప్ పరిశ్రమకు ప్రత్యేక డయోడ్లు

    ''ఎలాంటి సంక్షోభం వచ్చినా నిలబడగల సరఫరా గొలుసు అత్యవసరం. భారత్ దీనిని నిర్మించడానికి కృషి చేస్తోంది.కొవిడ్ సమయంలో ఈ సమస్యలను ఎదుర్కొన్నారు. మీరు భారత్‌లో పెట్టుబడులు పెడితే 21వ శతాబ్దంలో చిప్స్ కొరత ఎదురుకాదు. డయోడ్ ఒక దిశలో శక్తిని తీసుకెళ్తుంది, కానీ భారత చిప్ పరిశ్రమకు ప్రత్యేక డయోడ్లు ఉన్నాయి. వాటికి రెండు దిశల్లో శక్తి ప్రసారమవుతుంది. పెట్టుబడులు పెట్టి మీ విలువను సృష్టించుకోండి. సుస్థిర విధానాలు, సులభమైన వ్యాపార ప్రక్రియలను మేము మీకు అందిస్తాం'' అని మోదీ హామీ ఇచ్చారు.

    వివరాలు 

    సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్‌

    కరోనా వైరస్ పుట్టుకైన చైనాలో కఠిన ఆంక్షలు అమలుచేయడం వల్ల ఆ దేశంపై ఆధారపడిన ఇతర దేశాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి.

    సెమికండక్టర్ పరిశ్రమ కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంది.

    ఇప్పుడు అనేక దేశాలు సెమీకండక్టర్ల తయారీకి ప్రత్యామ్నాయంగా భారత్‌వైపు చూస్తున్నాయి.

    ఈ క్రమంలోనే ప్రధాని వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం దక్కించుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    PM Modi: ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ భారతదేశం
    NarendraModi: 40 కోట్ల మంది స్వాతంత్య్రాన్ని సాధించారు- మనం దేశాన్ని సుసంపన్నం చేయలేమా భారతదేశం
    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ బహుళ వర్ణ లెహెరియా ప్రింట్ టర్బన్‌  స్వాతంత్య్ర దినోత్సవం
    Narendra Modi: ప్రజల జీవితాల్లో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకు కృషి: మోదీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025