
Odisha: ఒడిశాలో దారుణం.. భువనేశ్వర్ మున్సిపల్ అధికారిపై బీజేపీ కార్పొరేటర్ దౌర్జన్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో అధికార పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు రెచ్చిపోయారు. నగరంలోని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కార్యాలయంలో ఒక సీనియర్ అధికారిపై బీజేపీకి చెందిన వ్యక్తులు భయానక దాడికి పాల్పడ్డారు. BMC అదనపు కమిషనర్ రత్నాకర్ సాహూ కార్యాలయంలో ఉన్న సమయంలోనే మూకుమ్మడి దాడికి గురయ్యారు. సీనియర్ అధికారిని కొందరు ఈడ్చుకుని వెళ్తుండగా, మరికొందరు కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఇలా అధికారులు విచక్షణ లేకుండా బయటకు లాక్కెళ్తుండగా, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ఈ దాడిపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్రంలోని శాంతి, భద్రతల పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిందని ఆరోపిస్తూ, అధికార పార్టీపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి.
వివరాలు
ఉద్యోగుల నిరసన, సేవల నిలిపివేత
ఈ దారుణ ఘటనపై మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సీనియర్ అధికారిపై, అది కూడా కార్యాలయంలోనే దాడి జరగడం పట్ల మండిపడ్డ వారు. "మేము ఎవరి మీద ఆధారపడాలి? రక్షణ ఎవరు కల్పిస్తారు?" అంటూ ప్రశ్నించారు. దీనిని నిరసిస్తూ కార్యాలయం ముందే నిరసన ధర్నాకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఒడిశా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ అసోసియేషన్ (OASA) జూలై 1వ తేదీ నుంచి సభ్యులందరూ సామూహిక సెలవులు తీసుకోవాలని నిర్ణయించింది.
వివరాలు
కేసు నమోదు, అరెస్టులు
ఇది ఓ క్రూర చర్యగా భావించిన పోలీసులు, ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. విచారణ కొనసాగుతోందని, త్వరలోనే మిగిలిన నిందితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వివరాలు
నవీన్ పట్నాయక్ తీవ్ర స్పందన
ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఒక అమానవీయ చర్యగా అభివర్ణించిన ఆయన, ఈ దాడి పక్కా రాజకీయ కుట్ర ఫలితమని ఆరోపించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన నాయకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని నగరంలో, అది కూడా ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.
వివరాలు
అశోక్ పాండా ఆరోపణలు
బీజేడీ నేత అశోక్ పాండా మాట్లాడుతూ, ఇది అశ్లీలమైన చర్యగా పేర్కొన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా చెల్లాచెదురైపోయినందుకు ప్రస్తుత ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అధికారులే రక్షించబడని ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజల పరిస్థితి ఊహించదగినదే కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని, ఈ కుట్ర వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆగ్రహం ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. బీజేపీ పాలనలో చట్టాన్ని పక్కనపెట్టే స్థితి ఏర్పడిందని విమర్శించింది. బీజేపీ నేత అపరూప్ రౌత్ తన అనుచరులతో కలిసి అధికారిని దాడి చేసి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.
వివరాలు
భాధితుడి వివరణ
దాడికి గురైన అధికారి రత్నాకర్ సాహూ కూడా ఈ విషయంపై స్పందించారు. ఒక ఫిర్యాదును విచారించే సమయంలో తనపై దాడి జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో కార్పొరేటర్ జీవన్ రౌత్ తో పాటు అతని అనుచరులు తన ఛాంబర్లోకి దూసుకొచ్చారని వివరించారు. వారు తనతో దురుసుగా ప్రవర్తించి, అనంతరం భౌతిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కార్యాలయం నుంచి బలవంతంగా బయటకు లాగి, కార్ దగ్గరకు తీసుకెళ్లారని వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నవీన్ పట్నాయక్ చేసిన ట్వీట్
I am utterly shocked seeing this video.
— Naveen Patnaik (@Naveen_Odisha) June 30, 2025
Today, Shri Ratnakar Sahoo, OAS Additional Commissioner, BMC, a senior officer of the rank of Additional Secretary was dragged from his office and brutally kicked and assaulted in front of a BJP Corporator, allegedly linked to a defeated… pic.twitter.com/yf7M3dLt9C