NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
    తదుపరి వార్తా కథనం
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు
    పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు

    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు

    వ్రాసిన వారు Stalin
    Jul 18, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరకేంగా ప్రతిపక్షాలు బెంగళూరులో నిర్వహిస్తున్న సమావేశాలు మంగళవారం కూడా కొనసాగనున్నాయి. రెండోరోజు సమావేశానికి 26రాజకీయ పార్టీలు హాజరవుతాయని కాంగ్రెస్ పేర్కొంది.

    అలాగే ఇదే మంగళవారం రోజున ఎన్డీయే మిత్రపక్షాల సమావేశాన్ని బీజేపీ దిల్లీలో నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి 38పార్టీలు హాజరవుతాయని బీజేపీ తెలిపింది.

    అధికార, ప్రతిపక్షాల పోటాపోటీగా నిర్వహిస్తున్నఈ సమావేశాలు దేశ రాజకీయాలపై, 2024ఎన్నికలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి.

    విచిత్రం ఏంటంటే 545మంది సభ్యులున్న లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల కూటముల్లోని మొత్తం 64పార్టీల్లో కేవలం 9పార్టీలకు మాత్రమే 10లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి.

    లోక్‌సభలో ఈ తొమ్మిది పార్టీల సభ్యుల సంఖ్య 479కావడం గమనార్హం.

    ప్రతిపక్ష కూటమిలో అయితే చాలా పార్టీలకు లోక్‌సభలో అసలు ప్రాతినిధ్యమే లేదు.

    రాజకీయం

    నేడు ప్రతిపక్షాల కూటమి పేరు ఖరారు

    బెంగుళూరులో సోమవారం జరిగిన సమావేశంలో ప్రతిపక్షాలు కీలక అంశాలపై చర్చించారు.

    బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండోరోజు సమావేశానికి హాజరవుతున్నాయి.

    రెండో రోజు చర్చల్లో కూటమి పేరును ఖరారు చేయనున్నారు. అలాగే కామన్ మినిమమ్ ప్రోగామ్‌ను కూడా నిర్ణయించనున్నారు.

    కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిపై కూడా మంగళవారం ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

    'యునైటెడ్ వి స్టాండ్' నినాదంతో ముందుకెళ్లాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

    బెంగళూరులో జరుగుతున్న ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా ప్రతిపక్షాలు అభివర్ణిస్తున్నాయి.

    రాజకీయం

    24నుంచి 38కి పెరిగిన ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య 

    1998లో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాల సంఖ్య 24 ఉంటే, ఇప్పుడు 38కి పెరిగింది. ఈ పరిణామం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకానికి ప్రజాదరణకు నిదర్శనమని బీజేపీ నాయకులు చెబుతున్నారు.

    ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(ఏఐడీఎంకే), తమిళ మనీలా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ (థామస్), భరత్ ధర్మ జన సేన వంటి పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది.

    ఎన్‌డీయే మిత్ర పక్షాల సమావేశం గురించి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, రూ.20లక్షల కోట్లకు పైగా అనినీతి కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రతిపక్షాలు
    బెంగళూరు
    కాంగ్రెస్
    బీజేపీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ప్రతిపక్షాలు

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ బెంగళూరు

    బెంగళూరు

    ప్రియుడి ఘాతుకం: బెంగళూరులో కాకినాడ యువతి దారుణ హత్య కర్ణాటక
    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్ ఆపిల్
    20 నిమిషాల్లో పిజ్జా డెలివరీ చేసే సర్వీస్‌ ను బెంగళూరులో ప్రారంభించిన Domino's ప్రకటన
    తోపుడు బండిపై సమోసాలతో రోజుకి 12 లక్షల సంపాదిస్తున్న దంపతులు వ్యాపారం

    కాంగ్రెస్

    Telangana Formation Day 2023: తెలంగాణ పదేళ్ల సంబరం; ఉద్యమ చరిత్రను ఓసారి స్మరించుకుందాం  తెలంగాణ
    ఉక్రెయిన్‌పై రాహుల్ కీలక వ్యాఖలు; భారత్ వైఖరిని సమర్థించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    బ్రిజ్ భూషణ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ
    కన్నడిగులకు సిద్ధరామయ్య సర్కార్ శుభవార్త.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కర్ణాటక

    బీజేపీ

    మనీష్ సిసోడియాను తలుచుకొని అరవింద్ కేజ్రీవాల్ కంటతడి  దిల్లీ
    బీజేపీ వైపు జేడీఎస్ చూపు; 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి కర్ణాటకలో ఎదురుదెబ్బ! కర్ణాటక
    'వన్ ఆన్ వన్' వ్యూహం: 450లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్షాల నుంచి బీజేపీపై ఒక్కరే పోటీ  లోక్‌సభ
    అసోంలో దారుణం: మహిళా బీజేపీ నాయకురాలు జోనాలి నాథ్ హత్య!  అస్సాం/అసోం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025