NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 
    తదుపరి వార్తా కథనం
    Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 
    Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు

    Maharashtra: ఎన్డీయేలో సీట్ల పంపకంపై వీడని చిక్కుముడి.. అమిత్ షా వరుస సమావేశాలు 

    వ్రాసిన వారు Stalin
    Mar 06, 2024
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో లోక్‌సభ సీట్ల పంపకంపై ఉత్కంఠ నెలకొంది.

    ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం, బుధవారం మహారాష్ట్రలో పర్యటిస్తుండటం రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది.

    అమిత్ షా మంగళవారం అర్థరాత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ఉప ముఖ్యమంత్రులు అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్‌లతో వరుస సమావేశాలు నిర్వహించారు.

    ఈ సమావేశాల్లో లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చించారు. ఈ క్రమంలో గత ఎనిమిది గంటల్లో మిత్ర పక్షాల నేతలతో అమిత్ షా రెండోసార్లు భేటీ అయ్యారు.

    బుధవారం ఉదయం కూడా శివసేన(షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్) నేతలు షాను కలిశారు.

    అమిత్ షా

    సీట్లు డిమాండ్ చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలి: అమిత్ షా

    ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో బుధవారం షిండే, అజిత్ పవార్‌తో అమిత్ షా మాట్లాడారు.

    ఈ సందర్భంగా ఇద్దరు నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేశారు.

    ఇద్దరు నాయకులు దూకుడు మానుకోవాలని, సీట్లు డిమాండ్ చేసేటప్పుడు సహేతుకంగా ఉండాలని సూచించారు.

    బీజేపీ మార్చి 2న లోక్‌సభ ఎన్నికల కోసం 195మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

    ఆ జాబితాలో మహారాష్ట్రకు సంబంధించి ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.

    సీట్ల పంపకం కొలిక్కి వచ్చాక.. రెండో జాబితాలో వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    మరాఠా రిజర్వేషన్‌ సమస్యకు కేంద్రబిందువైన మరాఠ్వాడా ప్రాంతంలోని సంభాజీనగర్‌లో మంగళవారం షా పర్యటించారు.

    అనంతరం 20ఏళ్లుగా శివసేన కంచుకోటగా ఉన్న సంభాజీనగర్‌లో రోడ్‌షో, బహిరంగ సభ నిర్వహించారు.

    మహారాష్ట్ర

    ఎవరు ఎన్ని సీట్లు పొందవచ్చు?

    ఎన్‌డీటీవీ నివేదిక ప్రకారం.. బీజేపీ తన అభ్యర్థులను 30స్థానాల్లో నిలబెట్టాలని చూస్తోంది. శివసేనకు 12సీట్లు, ఎన్సీపీకి 6సీట్లు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

    అయితే ఏక్‌నాథ్ షిండే శివసేన వర్గం గత లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టిన 23 స్థానాలను డిమాండ్ చేస్తోంది.

    శివసేనలో చీలిక కారణంగా.. గతసారి గెలిచిన 18 స్థానాలను అయినా తమకు ఇవ్వాలని షిండే వర్గం డిమాండ్ చేస్తోంది.

    మరోవైపు ఎన్సీపీ 10 సీట్లను అడుగుతోంది. ఎన్సీపీ చీలక ముందు, గత ఎన్నికల్లో 19 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి కేవలం 4 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

    అయితే గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు సీట్లతో పాటు మరో 2 సీట్లను అదనంగా ఇవ్వాలని బీజేపీ భావిస్తోందట.

    మహారాష్ట్ర

    ఏయే సీట్లలో సమస్య ఉంది?

    కళ్యాణ్, సౌత్ ముంబై, రత్నగిరి, షిరూర్, అమరావతి, శంభాజీనగర్ నగర్, హింగోలి, నాసిక్, రామ్‌టెక్, మావల్ సీట్ల విషయంలో సందిగ్ధత నెలకొన్నట్లు తెలుస్తోంది.

    శివసేన మాజీ ఎంపీ ఆనంద్ రావ్ అద్సుల్ అమరావతి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తుండగా, ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ నవనీత్ రాణాను బరిలోకి దింపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

    కళ్యాణ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు.

    శివసేనకు చెందిన అరవింద్ సావంత్ దక్షిణ ముంబై నుంచి ఎంపీగా ఉన్నారు. బీజేపీ నుంచి అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    అమిత్ షా

    అమిత్ షాతో బండి సంజయ్ భేటీ; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ  తెలంగాణ
    Delhi services bill: లోక్‌సభలో 'దిల్లీ సర్వీసెస్ బిల్లు'ను ప్రవేశపెట్టిన అమిత్ షా  దిల్లీ ఆర్డినెన్స్
    దిల్లీ బిల్లుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. కూటమిలో ఉన్నారని అవినీతిని సమర్థించకూడదు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    'దిల్లీ సర్వీసెస్ బిల్లు'కు రాజ్యసభలో ఆమోదం; సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఆప్ దిల్లీ సర్వీసెస్ బిల్లు

    మహారాష్ట్ర

    Maharashtra: ఆన్‌లైన్ లో బెట్టింగ్ గేమ్ ఆడిన పూణే పోలీసు సస్పెండ్  భారతదేశం
    నేడు గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కేంద్ర మాజీ మంత్రి బాబాన్‌రావ్ ధాక్నే కన్నుమూత భారతదేశం
    ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై మరాఠా కోటా నిరసనకారులు నిప్పు  భారతదేశం

    తాజా వార్తలు

    PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం  నరేంద్ర మోదీ
    Ram Charan : రామ్ చరణ్‌తో 'నాటు నాటు' పాటకు స్టెప్పులేసిన సల్మాన్, షారూఖ్, అమీర్  రామ్ చరణ్
    Family Star teaser: 'ఫ్యామిలీ స్టార్' టీజర్ రిలీజ్ డేట్, టైమ్‌ను ప్రకటించిన యూనిట్ ఫ్యామిలీ స్టార్
    Shehbaz Sharif: పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ ఎన్నిక.. రెండోసారి వరించిన పదవి పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025