NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 
    తదుపరి వార్తా కథనం
    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 
    హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు

    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 09, 2025
    05:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హనీమూన్‌ సందర్భంగా మేఘాలయలో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    తాజాగా ఆయన మృతదేహంపై నిర్వహించిన శవ పరీక్ష పూర్తి అయింది. అందులో తలకు తీవ్రంగా గాయాలైనట్లు బయటపడింది. ఈ విషయాన్ని సంబంధిత మీడియా నివేదికలు వెల్లడించాయి.

    ఈ నెల 11న రాజా రఘువంశీ,సోనమ్‌ల వివాహం ఘనంగా జరిగింది.

    కొత్తగా వివాహితులైన ఈ జంట మే 20న హనీమూన్‌ కోసం మేఘాలయా రాష్ట్రానికి వెళ్లారు.

    అక్కడ మే 22న వారు ఓ ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకొని మౌలాకియాత్‌ అనే గ్రామానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

    వారు బైక్‌ను ఆ గ్రామంలో నిలిపి,ప్రముఖ పర్యాటక ఆకర్షణగా పేరుగాంచిన 'లివింగ్ రూట్‌ వంతెన'ను చూడటానికి వెళ్లినట్లు సమాచారం.

    వివరాలు 

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో సోనమ్‌

    అయితే ఆ తర్వాత ఈ జంట ఆచూకీ గల్లంతైంది. అదృశ్యమైన 11 రోజుల అనంతరం, మే 22న అదృశ్యమైన రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు సోహ్రా ప్రాంతంలోని ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో గుర్తించారు.

    మృతదేహంపై కత్తితో చేసిన గాయాలు ఉండటంతో పోలీసులు హత్యకేసుగా భావిస్తున్నారు.

    తాజాగా విడుదలైన పోస్టుమార్టం నివేదిక ప్రకారం, అతని తలకు తీవ్ర గాయాలైనట్లు, శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు వెల్లడైంది.

    ఈ కేసు నేపథ్యంలో, కనిపించకుండా పోయిన సోనమ్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజీపుర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    తాను భర్తను హత్య చేయలేదని, కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేశారని ఆమె చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మేఘాలయ

    తాజా

    Honeymoon Couple Missing: హనీమూన్‌కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ మృతదేహానికి పోస్టుమార్టం.. నివేదికలో సంచలన విషయాలు  మేఘాలయ
    #NewsBytesExplainer: 'అమరావతి వేశ్యల రాజధాని' వ్యాఖ్య కలకలం.. రాష్ట్రంలో భగ్గుమన్న నిరసనలు.. అసలేం జరిగింది? అమరావతి
    World Test Championship: ఆసీస్ జట్టుకు అవమానం.. లార్డ్స్‌లో ప్రాక్టీస్‌కు ప్లేయర్లకు నిరాకరణ! ఆస్ట్రేలియా
    Team india: పేస్‌ కాకుండా కంట్రోల్‌ ముఖ్యం.. యువ బౌలర్లకు భరత్ అరుణ్ సలహా టీమిండియా

    మేఘాలయ

    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    Assembly Election 2023: మేఘాలయ, నాగాలాండ్‌లో ఓటింగ్; 4రాష్ట్రాల్లో అసెంబ్సీ బై పోల్ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025