
Metro Fare Rise: మెట్రో ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరుగనున్న ఛార్జీలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే భారీ షాక్ ఎదురవనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి మెట్రో రైలు టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
గతంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) అందించిన నివేదిక ఆధారంగా ధరల పెంపు జరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే మెట్రో అధికారులు, ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకొని చార్జీల పెంపుకు ఆమోదం పొందాలని యత్నిస్తున్నారు.
కరోనా కారణంగా గతంలో ఏడాదిపాటు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
దీంతో మెట్రో సంస్థపై ఆర్థిక భారం పెరిగింది. ప్రస్తుతం ఈ నష్టం దాదాపు రూ.6,598 కోట్లకు చేరినట్లు సమాచారం.
Details
రోజుకు రూ.1200 సర్వీసులు
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు సుమారు 1,200 సర్వీసులు నడుస్తుండగా, సగటున 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
వారం చివరలో ఈ సంఖ్య 5.10 లక్షల వరకు పెరుగుతోంది. ఎల్ అండ్ టీ మెట్రోకు ఎఫ్ఎఫ్సీ నివేదిక ఆధారంగా టికెట్ ధరలు పెంచే స్వతంత్ర అధికారం ఉంది.
మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్-2002 ప్రకారం ధరలు సవరణకు తగిన ప్రక్రియ మొదలైంది.
మెట్రో అధికారులు ప్రస్తుత ధరల కంటే 25-30 శాతం మేర పెంపు చేసే ప్రణాళికలో ఉన్నారు.
ఈ పెంపుతో ప్రతి ఏడాది రూ.150 నుంచి రూ.170 కోట్లు అదనంగా ఆదాయం పొందగలమన్న ఆశతో ఉన్నారు.
Details
పెరిగే మెట్రో చార్జీల అంచనా ఇలా
0-2 కిలోమీటర్లు: రూ.10 → రూ.15
2-4 కిలోమీటర్లు: రూ.15 → రూ.20
4-6 కిలోమీటర్లు: రూ.25 → రూ.35
6-8 కిలోమీటర్లు: రూ.30 → రూ.40
8-10 కిలోమీటర్లు: రూ.35 → రూ.45
10-14 కిలోమీటర్లు: రూ.40 → రూ.55
14-18 కిలోమీటర్లు: రూ.45 → రూ.60
18-22 కిలోమీటర్లు: రూ.50 → రూ.65
22-26 కిలోమీటర్లు: రూ.55 → రూ.70
26 కిలోమీటర్ల పైగా: రూ.60 → రూ.75