LOADING...
Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?
రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?

Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్డుల పంపిణీని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదు.

Details

క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభం  కాలేదు

మరింతగా మూడు నెలల క్రితం నిర్వహించిన కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వేలో గుర్తించిన అర్హుల జాబితా కూడా ఇప్పటికీ జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు చేరలేదు. అంతేకాదు ఆన్‌లైన్ దరఖాస్తులపై కనీస పరిశీలన కూడా మొదలుకాలేదు. ఈ కారణాలతో, మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన కుటుంబాల సంఖ్య గురువారం నాటికి 1,31,484కి చేరింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నా క్షేత్రస్థాయి విచారణ ఇంకా ప్రారంభమవ్వలేదు. అదనంగా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందని పరిస్థితి ఉంది.

Details

రేషన్ కార్డుల పంపిణీపై అనుమానాలు

అయినా ఇటీవల ప్రకటించిన ప్రకారం, మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపినా భౌతిక స్థాయిలో పరిశీలన ఇంకా సాగకపోవడంతో ఈ ప్రక్రియ ఆ తేదీ నాటికి పూర్తి కావడం అనుమానాస్పదంగా మారింది. పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మాత్రమే కార్డులు మంజూరు చేసే అవకాశముంది. దీంతో మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.