NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?
    రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?

    Ration Cards: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు షాకింగ్ న్యూస్! మంజూరు ప్రక్రియలో జాప్యం?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 28, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ చేసేందుకు చర్యలు చేపట్టింది.

    ఈ క్రమంలో ఇప్పటికే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించిన అధికారులు, అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.

    ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్డుల పంపిణీని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది.

    హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు.

    అయితే దీనిపై పౌరసరఫరాల శాఖ అధికారులకు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అందలేదు.

    Details

    క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభం  కాలేదు

    మరింతగా మూడు నెలల క్రితం నిర్వహించిన కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వేలో గుర్తించిన అర్హుల జాబితా కూడా ఇప్పటికీ జీహెచ్ఎంసీ నుంచి పౌరసరఫరాల శాఖకు చేరలేదు.

    అంతేకాదు ఆన్‌లైన్ దరఖాస్తులపై కనీస పరిశీలన కూడా మొదలుకాలేదు. ఈ కారణాలతో, మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసిన కుటుంబాల సంఖ్య గురువారం నాటికి 1,31,484కి చేరింది. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నా క్షేత్రస్థాయి విచారణ ఇంకా ప్రారంభమవ్వలేదు.

    అదనంగా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు అందని పరిస్థితి ఉంది.

    Details

    రేషన్ కార్డుల పంపిణీపై అనుమానాలు

    అయినా ఇటీవల ప్రకటించిన ప్రకారం, మార్చి 1 నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపినా భౌతిక స్థాయిలో పరిశీలన ఇంకా సాగకపోవడంతో ఈ ప్రక్రియ ఆ తేదీ నాటికి పూర్తి కావడం అనుమానాస్పదంగా మారింది.

    పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం మాత్రమే కార్డులు మంజూరు చేసే అవకాశముంది.

    దీంతో మార్చి 1వ తేదీన కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగకపోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ఇండియా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    Sand Door Delivery: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇసుక డోర్ డెలివరీ భారతదేశం
    Horticulture: ఉద్యాన పంటలకు కేంద్ర ప్రభుత్వం భారీగా సాయం కేంద్ర ప్రభుత్వం
    Telangana: తెలంగాణ హైకోర్టులో విషాద ఘటన.. కేసు వాదిస్తు కుప్పకూలిన న్యాయవాది  భారతదేశం
    LRS: లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకంపై ప్రభుత్వ కీలక నిర్ణయం  భారతదేశం

    ఇండియా

    West Bengal: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేతలపై కాల్పులు.. ఇద్దరి పరిస్థితి విషమం పశ్చిమ బెంగాల్
    Kolkata Doctor Case: నన్ను ఇరికిస్తున్నారు.. కోర్టులో నిందితుడి అవేదన కోల్‌కతా
    Goa: పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదం.. ఇద్దరు మృతి గోవా
    Manu Bhakar: రోడ్డు ప్రమాదంలో మను భాకర్ కుటుంబ సభ్యులు మృతి స్పోర్ట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025