NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు
    తదుపరి వార్తా కథనం
    ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు
    రూ.500 కరెన్సీ కట్టలతో సెల్ఫీని సోషల్ మీడియాలో పెట్టిన భార్యాపిల్లలు

    ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 30, 2023
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

    జిల్లాలోని బెహతా ముజావర్ పోలీస్ స్టేషన్‌లో రమేష్‌ చంద్ర సహాని సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల ఎస్ఐ సహాని భార్యా , పిల్లలు వారి ఇంట్లోని రూ.500 నోట్ల కరెన్సీ కట్టలతో సెల్ఫీ దిగారు.

    అనంతరం సెల్ఫీని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కాస్త వైరల్ అయ్యింది. విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కంగుతున్న సీనియర్ ఆఫీసర్లు ఎస్సై సహానిపై విచారణకు ఆదేశించారు.

    details

    ఫోట్ వైరల్ అవుతున్న అంశం మా దృష్టికి వచ్చింది : పోలీస్ ఉన్నతాధికారి 

    ఈ క్రమంలో సహానిని వెంటనే వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఫొటోలోని రూ. 14 లక్షలపై ఎస్‌ఐ సహాని వివరణ ఇచ్చారు.

    ఆ ఫోటో నవంబర్ 14, 2021న కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు తీసుకున్నామని తెలిపాడు. మరోవైపు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాన్ని తాము గుర్తించినట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి చెప్పాడు.

    సదరు పోలీస్ భార్య, పిల్లలు సెల్ఫీలో చూపించిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై విచారిస్తున్నామన్నారు.

    సదరు ఫోటోలో సహాని భార్య, పిల్లలు ఉన్నారని, వారు నోట్ల కట్టలను చూపిస్తూ ఫోజులు ఇచ్చారన్నారు. దీని ఆధారంగా సహానిపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    సోషల్ మీడియా

    తాజా

    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్
    Nara Rohit: ఈ ఏడాది అక్టోబర్‌లోనే నా పెళ్లి: నారా రోహిత్ నారా రోహిత్
    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్

    ఉత్తర్‌ప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్ హత్య కేసు: ఉమేష్ పాల్‌పై కాల్పులు జరుపుతున్న సీసీటీవీ వీడియో వైరల్ తుపాకీ కాల్పులు
    ఉమేష్ పాల్ హత్య కేసు నిందితులకు నేపాల్‌లో ఆశ్రయం; అండర్ వరల్డ్‌ నాయకుడు అన్సారీ అరెస్టు భారతదేశం
    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఎంపీ

    సోషల్ మీడియా

    డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు మార్క్ జూకర్ బర్గ్
    సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ భారతదేశం
    Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ'  ఎలాన్ మస్క్
    'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్  ట్విట్టర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025