NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
    తదుపరి వార్తా కథనం
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
    మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు

    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం

    వ్రాసిన వారు Stalin
    Feb 25, 2023
    09:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

    క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఢీకొన్న ప్రమాదంలో ఓ బస్సు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

    మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

    మధ్యప్రదేశ్

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    రేవా కమిషనర్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

    శుక్రవారం సాత్నాలో నిర్వహించిన అమిత్ షా సభలో పాల్గొని బస్సులో తిరుగు ప్రయాణమైన క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    ట్రక్కు టైరు పగిలిపోవడంతో అది అదుపు తప్పిందని వెల్లడించారు. వేగంగా వచ్చిన ట్రక్కు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీని ప్రభావంతో బస్సు ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.

    ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

    మృతుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    మధ్యప్రదేశ్
    బస్

    తాజా

    Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం   హిమంత బిస్వా శర్మ
    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు
    Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్‌ కలకలం.. ఒమిక్రాన్‌ బీఏ.2 నిర్ధారణ విశాఖపట్టణం
    Punjab: పంజాబ్ బడుల్లో తెలుగు పాఠాలు..! విద్యార్థులకు భాషాపై విశేష శిక్షణ పంజాబ్

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి మహారాష్ట్ర

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    బస్

    బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు ఆటో మొబైల్
    ఇండియాలో ఈ బస్సు వెరీ స్పెషల్ మహారాష్ట్ర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025