NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
    భారతదేశం

    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం

    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 25, 2023, 09:00 am 1 నిమి చదవండి
    సిధి: మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు- 14మంది దుర్మరణం
    మధ్యప్రదేశ్‌లో ఆగి ఉన్న బస్సులను ఢీకొన్న ట్రక్కు

    మధ్యప్రదేశ్‌లోని సిద్ధిలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కు అదుపు తప్పి ఆగి ఉన్న రెండు బస్సులను ఢీకొనడంతో 14 మంది మరణించారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రేవా-సత్నా సరిహద్దులోని మోహనియా సొరంగం సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఢీకొన్న ప్రమాదంలో ఓ బస్సు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

    మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    రేవా కమిషనర్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాత్నాలో నిర్వహించిన అమిత్ షా సభలో పాల్గొని బస్సులో తిరుగు ప్రయాణమైన క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కు టైరు పగిలిపోవడంతో అది అదుపు తప్పిందని వెల్లడించారు. వేగంగా వచ్చిన ట్రక్కు బస్సులను వెనుక నుంచి ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీని ప్రభావంతో బస్సు ఒకటి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు, గాయపడిన వారికి రూ.5లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    మధ్యప్రదేశ్
    రోడ్డు ప్రమాదం
    బస్

    మధ్యప్రదేశ్

    హైదరాబాద్‌లో ఉగ్రవాదుల కదలికలపై దర్యాప్తు ముమ్మరం- మరొకరి అరెస్టు హైదరాబాద్
    కునో నేషనల్ పార్క్‌లో మరో చిరుత మృతి; 40 రోజుల్లో మూడో మరణం తాజా వార్తలు
    వంతెనపై నుంచి లోయలో పడిపోయిన బస్సు; 15 మంది మృతి  ఇండోర్
    రాహుల్ గాంధీని చంపుతానని బెదిరించిన వ్యక్తి అరెస్టు  రాహుల్ గాంధీ

    రోడ్డు ప్రమాదం

    కారు ప్రమాదంలో అసోం 'లేడీ సింగం' జున్మోని రభా మృతి; సీఐడీ విచారణ అస్సాం/అసోం
    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  మహారాష్ట్ర
    ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి ఉత్తరాఖండ్

    బస్

    తెలంగాణ ఆర్టీసీకి గణనీయంగా తగ్గిన నష్టాలు; నల్గొండ రీజియన్ టాప్  టీఎస్ఆర్టీసీ
    హైదరాబాద్‌-విజయవాడ రూట్‌లో 'ఈ-గరుడ' ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు  హైదరాబాద్
    అన్నీ వాహనాలకు తప్పనిసరి ఫిట్‌నెస్ పరీక్ష; ఆఖరు తేదీ పొడగింపు ఆటో మొబైల్
    ఏప్రిల్ నుంచి భారతదేశం అంతటా 7 శాతం పెరగనున్న టోల్ ఫీజులు రవాణా శాఖ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023