NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
    తదుపరి వార్తా కథనం
    భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు
    పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

    భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలం.. 300 మంది పర్యాటకులను రక్షించిన అధికారులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 19, 2023
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాలతో సిక్కిం అతలాకుతలమవుతోంది. నాలుగు రోజులగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తుండటంతో వరదలు పోటెత్తాయి.

    ఈ వరదల్లో సూమారు 3500 పర్యాటకులు ఉత్తరసిక్కిం జిల్లాలో చిక్కుపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. వారిలో దేశీయ పర్యాటకులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది.

    దీంతో పెంగాగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్‌థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్లు కోతకు గురై, పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.

    లిచెన్, లచుంగ్ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోని చిక్కుపోయారని అధికారులు తెలిపారు. దీంతో పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సిక్కిం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

    Details

    దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు చర్యలు

    ఇప్పటికే 1500 మంది పర్యాటకులను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి అధికారులు తరలించారు.

    తాజాగా ఉత్తర సిక్కిం జిల్లాలోని లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో చిక్కుపోయిన 300 మంది పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

    వారికి భోజన, వైద్య సదుపయాలను అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

    ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగిస్తున్నట్లు సిక్కిం ప్రభుత్వం తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సిక్కిం
    ప్రభుత్వం

    తాజా

    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
    KTR: బీఆర్ఎస్ నేత కేటీఆర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    CIRCADIAN APP: 7 సెకన్లలో గుండె సమస్యలను గుర్తించే యాప్‌.. 14 ఏళ్ల బాలుడి ఆవిష్కరణ గుండె
    #NewsBytesExplainer: డోనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ స్నేహ బంధం ఎక్కడ చెడింది? డొనాల్డ్ ట్రంప్

    సిక్కిం

    లోయలోకి దూసుకెళ్లిన ఆర్మీ వాహనం.. 16మంది భారత జవాన్లు మృతి భారతదేశం
    సిక్కింలో భూకంపం, యుక్సోమ్‌లో 4.3 తీవ్రత నమోదు భూకంపం
    సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది భారతదేశం
    కోస్తా అంధ్ర సహా తూర్పు భారతాన్ని మరింత హడలెత్తించనున్న వేడిగాలులు  ఉష్ణోగ్రతలు

    ప్రభుత్వం

    కేంద్ర కీలక నిర్ణయం.. 14 మొబైల్ యాప్స్ ను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్మూ
    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ నెల నుంచే సన్నబియ్యంతో భోజనం  తెలంగాణ
    'జగనన్నకు చెబుదాం'లో ఎలా ఫిర్యాదు చేయాలి? ఏ సమస్యకు పరిష్కారం లభిస్తుంది? ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025