NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం
    తదుపరి వార్తా కథనం
    Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం
    దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం

    Singareni Coal: దేశంలోనే సింగరేణి బొగ్గు ధరలు అత్యధికం.. విద్యుత్ సంస్థలపై అధిక భారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 14, 2024
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సింగరేణి బొగ్గు ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉండటంతో దక్షిణ భారత రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై భారీ ఆర్థికభారం పడుతోంది.

    ముఖ్యంగా మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ సంస్థలతో పోలిస్తే, సింగరేణి బొగ్గు ధర సగటున 2 రెట్లు ఎక్కువగా ఉంది. సింగరేణిలోని బొగ్గు ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి.

    సింగరేణి బొగ్గును నాణ్యత ఆధారంగా గ్రేడ్‌లవారీగా విక్రయిస్తారు. జీ5 గ్రేడ్ బొగ్గు సింగరేణి వద్ద టన్నుకు రూ. 5,685కి విక్రయిస్తే, మహానది రూ. 2,970కి, వెస్ట్రన్ రూ. 2,970కి అమ్ముతున్నారు.

    జీ16 గ్రేడ్‌కు, సింగరేణి రూ. 1,620కి విక్రయిస్తుండగా, మహానది రూ. 514, వెస్ట్రన్ రూ. 614కు అందిస్తోంది.

    Details

    వ్యయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి

    ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని, రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

    సింగరేణి ముఖ్యంగా జీ9, జీ10, జీ11, జీ12 గ్రేడ్‌ల బొగ్గును సరఫరా చేస్తోంది. అయితే ఈ గ్రేడ్‌ల బొగ్గు నాణ్యత తక్కువగా ఉండటంతో విద్యుత్ ఉత్పత్తిలో అధిక పరిమాణంలో వినియోగించాల్సి వస్తుంది.

    సింగరేణి గనులు తెలంగాణలో ఉన్నందున, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఇక్కడ బొగ్గు కొనుగోలు చేస్తున్నాయి.

    అయితే, ఇతర గనుల దూరంగా ఉన్నాయని, రవాణా వ్యయం ఎక్కువగా ఉండడంతో, తక్కువ ధరలో కొనుగోలు చేసినా మొత్తం ఖర్చులు ఎక్కువ అవుతాయి.

    Details

    డిస్కం నష్టాలను భర్తీ చేయాలి

    ఉదాహరణకు, భద్రాద్రి విద్యుత్ ప్లాంటులో కరెంటు ఉత్పత్తికి సగటున రూ. 5.50కి మించి వ్యయం అవుతోంది.

    2024-25లో, సింగరేణి నుంచి సరఫరా చేసిన బొగ్గుకు, టన్నుకు సగటున రూ. 5,369 చొప్పున వసూలు చేశారు. కొత్తగూడెం 7వ దశ కొత్త ప్లాంటుకు, బొగ్గుకు టన్నుకు రూ. 6,449 చొప్పున చెల్లించారు.

    ఈ అధిక ధరలు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)పై భారీ ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. దీంతో ప్రజలకు కరెంటు సరఫరా చేయాలంటే సగటున యూనిట్‌కు రూ. 7.37 వ్యయం అవుతోంది.

    ఈ నేపథ్యంలో, ఇంజినీర్లు కరెంటు ఛార్జీలను పెంచాలని లేదా డిస్కం నష్టాలను భర్తీ చేయాలని సింగరేణి కంపెనీ అధికారి బలరాం తెలిపారు,

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
    తెలంగాణ

    తాజా

    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్
    Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ త‌ర్వాత‌.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మ‌నీ భారతదేశం
    BAN vs UAE: యూఏఈ సంచలనం.. బంగ్లాదేశ్‌పై విజయం.. ఒక్క మ్యాచ్‌తో ఐదు రికార్డులు బంగ్లాదేశ్

    సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్

    SCCL ELECTIONS : సింగరేణి ఎన్నికలు వాయిదా.. ఆదేశాలిచ్చిన హైకోర్టు హైకోర్టు
    Singareni elections: తెలంగాణలో మరో ఎన్నికలకు తేదీ ఖరారు తాజా వార్తలు
    Singareni Elections : సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. 27న ఎన్నికలు యధాతథం  భారతదేశం
    Telangana : తెలంగాణలో యూనియన్ ఎన్నికలకు లైన్ క్లియల్.. బరిలో నిలిచిన ఈ సంఘాలివే భారతదేశం

    తెలంగాణ

    Rain Alert: నేడు,రేపు భారీ వర్షాలు.. గంటకు 40-50 కి.మీ. ఈదురు గాలులు  ఐఎండీ
    Vijaya Dairy: తిరుమల లడ్డూ వివాదం.. ఆలయ ప్రసాదాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం భారతదేశం
    Gandhi Temple: నిత్యం ధూప, దీప, నైవేద్యాలు పెట్టే ఈ గుడి స్పెషల్ ఏంటో తెలుసా..? ఇది ఎక్కడ ఉందొ తెలుసా? మహాత్మా గాంధీ
    Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం ఉత్తమ్ కుమార్‌రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025